‘తొలిప్రేమ’ మనసు మారిందా?

వరుణ్ తేజ-రాశీఖన్నా-వెంకీ అట్లూరి కాంబినేషన్ లో ముస్తాబయిన సినిమా తొలిప్రేమ. ఈ ప్రాజెక్టు గమనం చాలా చిత్రమైనది. మొత్తం ప్రాజెక్టు దిల్ రాజు దగ్గర పురుడుపోసుకుంది. కానీ బోగవిల్లి ప్రసాద్ దగ్గరకు దత్తత వెళ్లిపోయింది.…

వరుణ్ తేజ-రాశీఖన్నా-వెంకీ అట్లూరి కాంబినేషన్ లో ముస్తాబయిన సినిమా తొలిప్రేమ. ఈ ప్రాజెక్టు గమనం చాలా చిత్రమైనది. మొత్తం ప్రాజెక్టు దిల్ రాజు దగ్గర పురుడుపోసుకుంది. కానీ బోగవిల్లి ప్రసాద్ దగ్గరకు దత్తత వెళ్లిపోయింది. తీరా నిర్మాణం పూర్తయ్యాక, 17కోట్ల రేంజ్ కు టోటల్ రైట్స్ దిల్ రాజు దగ్గరకు వచ్చేసాయి. ఫిబ్రవరి 9న విడుదల అని డిసైడ్ అయ్యారు.

కానీ అక్కడే వచ్చింది తకరారు. మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ కూడా అదే డేట్ కు ఫిక్స్ అయ్యారు. దాంతో అరవింద్ లాంటి పెద్దలు కలుగచేసుకుని సాయి ధరమ్ ఇంటిలిజెంట్ తొమ్మిదిన, తొలి ప్రేమ 10 న విడుదలయ్యేలా మార్చారు. అయితే ఓవర్ సీస్ లో మాత్రం 8రాత్రికే తొలిప్రేమ ప్రీమియర్స్ పడతాయి. అంటే సోషల్ మీడియాలో తొలి ప్రేమ రిజల్ట్ రెండు రోజులకు ముందే తెలిసిపోతుంది. నిజానికి ఏ సినిమాకు అయినా ఇది అంత మంచి సైన్ కాదు.

అందుకే తొలిప్రేమ వ్యవహారాలు అన్నీ చూస్తున్న దిల్ రాజు ఇప్పుడు మనసు మార్చుకుని వేరే ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తొలిప్రేమ ప్రీమియర్లను 9న సాయంత్రం ఫస్ట్ షో తో కానీ, సెకెండ్ షో తో కానీ వదలాలని సమాలోచనలు చేస్తున్నారని వినికిడి.

ఈ మేరకు ఆల్రెడీ డిసైడ్ అయిపోయినట్లు తెలుస్తోంది. ఎందుకంటే 10న విడుదలయితే, ఇటు ఇంటిలిజెంట్, అటు గాయత్రితో కలిపి ఓపెనింగ్స్ తొలిప్రేమ షేర్ చేసుకోవాలి. అందుకే ఈ కొత్త నిర్ణయం తీసుకునే ఆలోచనలో వున్నట్లు తెలుస్తోంది.

అంటే 8రాత్రి ఓవర్ సీస్ లో ప్రీమియర్లు వుంటే, 9రాత్రి తెలుగు రాష్ట్రాల్లో తొలి ప్రేమ ప్రీమియర్లు వుంటాయి. బహుశా మరో ఒకటి రెండు రోజుల్లో ఈ నిర్ణయం బయటకు రావచ్చు.