Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఇదేనా ఐక్యత అంటే.. వీళ్లా టాలీవుడ్ పెద్దమనుషులు

ఇదేనా ఐక్యత అంటే.. వీళ్లా టాలీవుడ్ పెద్దమనుషులు

మేమంతా ఒకటే. టాలీవుడ్ ఓ పెద్ద కుటుంబం. ఎవరికి ఏ సాయం కావాల్సి వచ్చినా ముందుంటాం. యంగ్ టాలెంట్ ను నిత్యం ప్రోత్సహిస్తుంటాం. పొద్దునలేస్తే టాలీవుడ్ పెద్ద మనుషులు చెప్పే కబుర్లు ఇవి. కానీ ఐక్యత ముసుగులో ఎంత తొక్కాలో అంత తొక్కుతుంటారు. స్వలాభం కోసం తెరలు దించేస్తుంటారు. తాజాగా పెద్దమనుషుల నిర్వాకానికి శ్రీహరి కుటుంబం బలైంది.

శ్రీహరి బతికున్న రోజుల్లో ఆ ఇల్లు సందడిగా ఉండేది. ఎప్పుడైతే ఆయన ఆకస్మికంగా మనల్ని వీడి వెళ్లిపోయారో, అప్పుడే ఇండస్ట్రీ కూడా ఆ కుటుంబాన్ని దూరంపెట్టింది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచాడు శ్రీహరి కొడుకు మేఘాంశ్. ఓ పెద్ద నటుడి కొడుకు హీరోగా వస్తే టాలీవుడ్ లో సందడి ఏ రేంజ్ లో ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీ మొత్తం ఒక్కటైపోతుంది. పెద్ద పెద్ద కార్యక్రమాలు పెట్టి మరీ పండగ చేసుకుంటుంది. కానీ శ్రీహరి కొడుకు విషయంలో మాత్రం ఇండస్ట్రీ మౌనంగా ఉండిపోయింది. మనకు సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తోంది.

ఇండస్ట్రీలో ఓ పెద్ద హీరోను శ్రీహరి కుటుంబం స్వయంగా వెళ్లి కలిసింది. ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు రావాల్సిందిగా శ్రీహరి భార్య డిస్కోశాంతి స్వయంగా ఆహ్వానించారు. కానీ సదరు హీరో బిజీ అని చెప్పి తప్పించుకున్నారు. తన ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుందని చెప్పి పంపించాడు. కట్ చేస్తే... ఆ తర్వాత చిన్నాచితకా సినిమా ప్రమోషన్లకు హాజరయ్యాడు. ఓ 2 సినిమాలకు సంబంధించిన వ్యక్తుల్ని ఇంటికి పిలిపించుకొని మరీ అభినందించాడు. శ్రీహరి కొడుకు ఈమాత్రం దానికి కూడా నోచుకోలేదు పాపం.

ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లాంటి కార్యక్రమాలకు పిలిస్తే నిరాకరిస్తున్నారని శ్రీహరి ఫ్యామిలీ మరో ఆలోచన చేసింది. కొంతమంది హీరోలతో వీడియో బైట్లు వేయాలని ప్లాన్ చేసింది. మేఘాంశ్ కు మద్దతుగా ఒక్క 30 సెకెన్లు మాట్లాడితే చాలనుకుంది. కానీ సోకాల్డ్ పెద్దమనుషులు దీనికి కూడా ఒప్పుకోలేదు. 30 సెకెండ్లు సెల్ ఫోన్ లో మాట్లాడి వీడియో పంపించడానికి వీళ్లకు తీరిక లేదట.

చివరికి పరిస్థితి ఎంత దయనీయంగా తయారైందంటే.. ఒకప్పుడు శ్రీహరి లేకుండా సినిమాలు చేయలేమని, ఊహించుకోలేమని ఆర్భాటంగా ప్రకటనలు గుప్పించిన స్టార్లు కూడా ఇప్పుడు ముఖం చాటేశారు. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే.. దర్శకులు కూడా శ్రీహరి గురించి, అతడి కొడుకు డెబ్యూ గురించి మాట్లాడ్డానికి నిరాకరించారు.

ఉన్నంతలో పూరి జగన్నాధ్, శ్రీనువైట్ల, పరశురాం, హరీష్ శంకర్, సాయిధరమ్ తేజ్, అలీ, సతీష్ వేగేశ్న, లారెన్స్, మంచు మనోజ్, గోపీచంద్ మలినేని, బాబి, ఎన్.శంకర్, వెన్నెల కిషోర్ లాంటివాళ్లు మాత్రమే శ్రీహరి తనయుడు డెబ్యూ గురించి కాస్త మాట్లాడి తమ పెద్దమనసు చాటుకున్నారు.

పైకి పెద్దమనుషులమని చెప్పుకునే స్టార్ హీరోలు, దర్శకులు ఎవరూ ఈ లిస్ట్ లో లేరు. ఇది టాలీవుడ్ లో ఐక్యత అంటే. 

బాబు భ్రమలను నమ్మని జనం.. వికేంద్రీకరణకే జగన్‌ మొగ్గు?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?