Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ట్రబుల్ లో పడిన రామ్ సినిమా?

ట్రబుల్ లో పడిన రామ్ సినిమా?

రామ్-ప్రవీణ్ సత్తారు. ఈ సినిమా ముహుర్తం జరిగిపోయింది. స్రవంతి మూవీస్ నిర్మాణం. కానీ ఇప్పుడు ఈ సినిమాకు కాస్త బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. ప్రవీణ్ సత్తారు మేకింగ్ కాస్త కాస్ట్లీగా వుంటుంది. గరుడ వేగ సినిమా విషయంలో కూడా అదే జరిగింది. సినిమా సగానికి పైగా అయ్యాక నిర్మాతలు నానా ఇబ్బందులు పడ్డారు. విదేశాల్లో షూటింగ్, సముద్రంలో కాల్పులు, పేల్పులు అంటూ తెగ ఖర్చు చేయాల్సి వచ్చింది. మొత్తానికి ఏదో గట్టెక్కారు.

ఇప్పుడు స్రవంతి మూవీస్ దగ్గర కూడా ఆరంభంలోనే అదే సమస్య వచ్చినట్లు తెలుస్తోంది. స్రవంతి దగ్గర వ్యవహారం కాస్త నిక్కచ్చిగా వుంటుంది. రవికిషోర్ కాస్త స్థిరంగా వుంటారు. అందుకే డైరక్టర్ ప్రవీణ్ సత్తారుకు, నిర్మాత రవి కిషోర్ కు మధ్య కాస్త వ్యవహారం బెడిసి కొట్టినట్లు వార్తలు అందుతున్నాయి. ఈ వ్యవహారం దాదాపు ప్రాజెక్టు ఆగిపోయే వరకు వెళ్లేలా వుందని తెలుస్తోంది.

అయితే ఇప్పటికి అయితే ప్రాజెక్టు ఆగలేదు. కానీ వ్యవహారం మాత్రం అంత సీరియస్ గానూ వుందని వినికిడి.

ప్రవీణ్ సత్తారుకు గరుడ వేగ తరువాత హడావుడి జరిగినంతగా సినిమా ఆఫర్లు సెట్ కాలేదు అన్నది వాస్తవం. చాలా పేర్లు వినిపించి, ఆఖరికి రామ్ దగ్గర ఆగింది. ఇప్పుడు అది కూడా తేడా కొట్టి, ఆగిపోతే కష్టమే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?