Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పూరీ.. నిజంగానే ఈ సినిమాలు పట్టాలెక్కుతాయా?!

పూరీ.. నిజంగానే ఈ సినిమాలు పట్టాలెక్కుతాయా?!

ఇండస్ట్రీలో ఎంతటి స్టార్ అయినా.. విజయం చుట్టే తిరుగుతాడు. ఎవరైతే హిట్ల మధ్య ఉన్నారో అందరి దృష్టి వాళ్ల మీదే. ఫెయిల్యూర్ల మధ్య ఉంటే అతడి గతాన్ని, గొప్పదనాన్నీ ఎవరూ పట్టించుకోకపోవడం సినిమా ఇండస్ట్రీలో సహజ సూత్రం. మరి ఇలాంటి సంప్రదాయాలకు పూర్తి విరుద్ధం అనిపిస్తున్నాడు దర్శకుడు పూరీ జగన్నాథ్. ఇతడు చివరగా తీసిన రెండు సినిమాలూ ఎంత డిజాస్టర్లలో వేరే చెప్పనక్కర్లేదు! జ్యోతిలక్ష్మి, లోఫర్.. సినిమాలతో ఫెయిల్యూర్స్ నే మిగుల్చుకున్నాడు పూరీ.

ఎంతో హడావుడి మధ్య వచ్చిన ఈ రెండు సినిమాలూ డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలను మిగిల్చాయి. లోఫర్ సినిమా డిస్ట్రిబ్యూటర్లు చేసిన రచ్చ ఏమిటో వేరే వివరించనక్కర్లేదు కూడా. మరి వేరే దర్శకుడు ఎవరైనా ఇలాంటి డిజాస్టర్లను ఎదుర్కొని ఉంటే వారి పరిస్థితి ఏమిటో కానీ.. ఇప్పుడు పూరీ మాత్రం పెద్ద పెద్ద సినిమాలను అనౌన్స్ చేస్తున్నాడు. ఇప్పటికే మహేశ్ తో సినిమా అంటూ ట్వీట్ చేసేసిన పూరీ ఇప్పుడు అమితాబ్, అభిషేక్ లతో సినిమా అంటూ మరో లీక్ ఇచ్చాడు.

బాలీవుడ్ లో ఈ ఇద్దరు స్టార్ హీరోలతో ఒక సినిమా ప్రపోజల్ ఉన్నట్టుగా పూరీ క్యాంప్ నుంచి మీడియాకు సమాచారమందుతోంది. మరి మహేశే అనుకొంటే.. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోలతో కూడా సినిమా అంటూ మరో హడావుడి. మరి పరాజయాల్లో ఉన్నా పూరీకి పెద్ద స్టార్ లతో సినిమాలు ఎలా వర్కవుట్ అవుతున్నాయో! అనేది ఒక ఆశ్చర్యం అయితే.. ఈ సినిమాలు నిజంగానే పట్టాలెక్కుతాయా.. లేక ప్రకటనల హడావుడినా అనేది మరో సందేహం!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?