సంఘమిత్ర సైడ్ అయిపోయినట్టేనా..?

250కోట్ల రూపాయలతో సంఘమిత్ర లాంటి భారీ బడ్జెట్ సినిమాను ప్రకటించింది తేనాండాళ్ సంస్థ. దర్శకత్వ బాధ్యతల్ని సి.సుందర్ కు అప్పగించింది. ఆర్య, సత్యరాజ్ లాంటి నటుల్ని కూడా తీసుకున్నారు. ఏకంగా కేన్స్ ఫిలిం ఫెస్టివల్…

250కోట్ల రూపాయలతో సంఘమిత్ర లాంటి భారీ బడ్జెట్ సినిమాను ప్రకటించింది తేనాండాళ్ సంస్థ. దర్శకత్వ బాధ్యతల్ని సి.సుందర్ కు అప్పగించింది. ఆర్య, సత్యరాజ్ లాంటి నటుల్ని కూడా తీసుకున్నారు. ఏకంగా కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ఈ సినిమాను లాంచ్ చేశారు. కానీ కీలకపాత్ర పోషించాల్సిన శృతిహాసన్ హ్యాండ్ ఇవ్వడంతో సంఘమిత్ర ప్రాజెక్టు వెనక్కి వెళ్లిపోయింది.

శృతిహాసన్ స్థానంలో చాలామంది హీరోయిన్లను ప్రయత్నించారు. రీసెంట్ గా హన్సిక కూడా ఈ సినిమాను తను చేయడం లేదంటూ ప్రకటించింది. ఇలా మెయిన్ లీడ్ దొరక్క సతమతమవుతున్న దర్శకుడు సుందర్ సి.. ఇప్పుడు తను కూడా ఈ ప్రాజెక్టు నుంచి కాస్త పక్కకు జరగాలని అనుకుంటున్నాడు.

సంఘమిత్ర సినిమా సెట్స్ పైకి వచ్చేలోపు మరో సినిమా స్టార్ట్ చేయాలని భావిస్తున్నాడు ఈ దర్శకుడు. ఐదేళ్ల కిందట తను తీసిన సూపర్ హిట్ మూవీ కలకళప్పుకు సీక్వెల్ తీయాలనుకుంటున్నాడు. ఆ సినిమాలో నటించిన అంజలి, ఒవియాలనే హీరోయిన్లుగా సెలక్ట్ చేసుకున్నాడు. ఈ సినిమాతోనే సంతానంకు స్టార్ డమ్ వచ్చింది.

సుందర్ సి కనుక ఈ సీక్వెల్ ప్రారంభిస్తే సంఘమిత్ర ప్రాజెక్టు మరింత వెనక్కి వెళ్లడం ఖాయం. ఎందుకంటే అన్నీ దగ్గరుండి చూసుకోవాల్సిన దర్శకుడే మెయిన్ ట్రాక్ నుంచి తప్పుకుంటే ఇక సినిమా దాదాపు ఆగిపోయినట్టే. మరి దీనిపై తేనాండాళ్ నిర్మాణ సంస్థ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.