Advertisement

Advertisement


Home > Movies - Movie News

విజయ్ దేవరకొండ.. సరిగ్గా ఏడాది గ్యాప్

విజయ్ దేవరకొండ.. సరిగ్గా ఏడాది గ్యాప్

లైగర్.. విజయ్ దేవరకొండ కెరీర్ లో అతిపెద్ద డిసప్పాయింట్ మెంట్. ఆ సినిమా తర్వాత తనకు తెలియకుండానే చాలా గ్యాప్ తీసుకున్నాడు ఈ హీరో. అలా గ్యాప్ తీసుకున్న దేవరకొండ, ఇప్పుడు ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ రెండు సినిమాల మధ్య గ్యాప్ సరిగ్గా ఏడాది.

గతేడాది ఆగస్ట్ 25న రిలీజైంది లైగర్ సినిమా. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ఖుషి సినిమాను సెప్టెంబర్ 1న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. సో.. లైగర్, ఖుషి సినిమాల మధ్య గ్యాప్ దాదాపు ఏడాదన్నమాట.

నిజానికి విజయ్ దేవరకొండ నుంచి ఖుషి సినిమా ఇంకాస్త ముందే వచ్చి ఉండేది. కానీ ఊహించని విధంగా సమంత అనారోగ్యానికి గురైంది. దీంతో సినిమా షూటింగ్ లేట్ అయింది. ఒక టైమ్ లో ఖుషి ప్రాజెక్టు ఆగిపోయిందంటూ పుకార్లు కూడా వచ్చాయి.

ఎట్టకేలకు సమంత ఈమధ్యే సెట్స్ పైకి వచ్చింది. శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలో బ్యాక్ టు బ్యాక్ అప్ డేట్స్ లైనప్ చేసింది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ. ఇందులో భాగంగా రిలీజ్ డేట్ ను ఈరోజు ప్రకటించింది.

మహానటి తర్వాత విజయ్-సమంత కలిసి నటిస్తున్న సినిమా ఇదే. తెలుగుతో పాటు ఇతర భాషల్లో పాన్ ఇండియా లెవెల్లో వస్తోంది ఈ మూవీ. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?