కన్నప్పలో చేరిన మరో ఇద్దరు ప్రముఖులు

మంచు విష్ణు హీరోగా నటిస్తున్న సినిమా కన్నప్ప. ఇప్పటికే ఈ ప్రాజెక్టు చాలా భారీగా తయారైంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో పాటు మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ సూపర్…

మంచు విష్ణు హీరోగా నటిస్తున్న సినిమా కన్నప్ప. ఇప్పటికే ఈ ప్రాజెక్టు చాలా భారీగా తయారైంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో పాటు మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఇందులో భాగమయ్యారు. ఇప్పుడీ ప్రాజెక్టులోకి మరో ఇద్దరు ప్రముఖులు వచ్చి చేరారు.

కన్నప్ప సినిమాలో రెండు కీలక పాత్రల కోసం మంచు మోహన్ బాబు, శరత్ కుమార్ లను తీసుకున్నారు. మంచు విష్ణు కలల ప్రాజెక్టు కాబట్టి, ఇందులో కచ్చితంగా మోహన్ బాబు ఉంటారని అంతా ముందే ఫిక్స్ అయ్యారు. అయితే ఆ విషయాన్ని ప్రకటించడం కాస్త లేట్ అయింది. ఎట్టకేలకు ఈ ప్రాజెక్టులోకి మోహన్ బాబు ఎంటరైనట్టు ప్రకటించారు.

ఇక తమిళ సీనియర్ నటుడు శరత్ కుమార్ ను కూడా మరో కీలక పాత్ర కోసం తీసుకున్నారు. తెలుగు తెరకు ఈ నటుడు కొత్త కాదు. ఎన్నో సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. ఇప్పుడు కన్నప్ప ప్రాజెక్టులోకి కూడా ఎంటరయ్యారు.

ఇన్ని కీలక పాత్రలు ఉన్నాయా..?

వెండితెరపై కన్నప్ప కథ అంటే అందరికీ భక్త కన్నప్ప సినిమా మాత్రమే. అందులో ప్రధాన పాత్ర పోషించిన కృష్ణంరాజుతో పాటు, మరికొన్ని పాత్రలు మాత్రమే కనిపిస్తాయి. కానీ ఇలా వివిధ భాషలకు చెందిన సూపర్ స్టార్ల్ నటించేంత పెద్ద పాత్రలు భక్త కన్నప్పలో కనిపించవు. కానీ మంచు విష్ణు కన్నప్పలో మాత్రం వీళ్లందరికీ కీలక పాత్రలు ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు.

ఈ సినిమా కథకు సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ, బుర్ర సాయిమాధవ్, తోట ప్రసాద్ మెరుగులు దిద్దారు. కచ్చితంగా వీళ్లే ఈ కథలో చాలా కీలక పాత్రలు ప్రవేశపెట్టి ఉంటారు. ఈ పాత్రలతో పాటు, సినిమాలో భారీ యుద్ధ సన్నివేశాలు కూడా ఉన్నాయట. అది కూడా వీళ్ల చలవే అయి ఉండొచ్చు.

ఇంతకీ మంచు విష్ణు సంగతేంటి..?

ఈ సంగతి పక్కనపెడితే.. మంచు విష్ణు గాయాల బారిన పడి న్యూజిలాండ్ లోనే ఓ హాస్పిటల్ లో చేరారు. ఆ విషయాన్ని మోహన్ బాబు స్వయంగా ప్రకటించారు. అలా ప్రకటించిన కొన్ని రోజులకే మంచు విష్ణు తిరిగి సెట్స్ పైకి వచ్చాడు. తన గాయం గురించి ప్రస్తావన కూడా లేకుండా సినిమా అప్ డేట్స్ ఇస్తున్నారు. ఇప్పుడిలా మంచు మోహన్ బాబు, శరత్ కుమార్ జాయిన్ అయినట్టు ప్రకటించారు.