మెగా ఫ్యాన్స్ కు డబుల్ బొనాంజా

భోళాశంకర్ డిజాస్టర్ తో చిరంజీవి అప్ కమింగ్ మూవీస్ పై అనుమానాలు పెరిగాయి. ఆయన సినిమాలకు విరామం ఇస్తారని కొందరన్నారు. కూతురు నిర్మాణ సారధ్యంలో సినిమా ఇంకాస్త ఆలస్యమౌతుందని, ఈ గ్యాప్ లో యూవీ…

భోళాశంకర్ డిజాస్టర్ తో చిరంజీవి అప్ కమింగ్ మూవీస్ పై అనుమానాలు పెరిగాయి. ఆయన సినిమాలకు విరామం ఇస్తారని కొందరన్నారు. కూతురు నిర్మాణ సారధ్యంలో సినిమా ఇంకాస్త ఆలస్యమౌతుందని, ఈ గ్యాప్ లో యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై సినిమాను ప్రకటిస్తారని కూడా ఊహాగానాలు చెలరేగాయి. మోకాలికి చిన్నపాటి సర్జరీ చేయించుకున్న చిరంజీవి, తన తదుపరి చిత్రాలకు గ్యాప్ ఇస్తారని మరికొందరు అన్నారు.

అయితే ఊహించని విధంగా చిరంజీవి నుంచి ఒకేసారి 2 సినిమాల అప్ డేట్స్ వచ్చేశాయి. గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై కూతురు సుశ్మిత నిర్మాతగా సినిమా ప్రకటన వచ్చేసింది. అయితే తాము చిరంజీవితో సినిమా చేయబోతున్నామని మాత్రమే ప్రకటించారు వీళ్లు. అంతకు మించి వివరాలు వెల్లడించలేదు. కనీసం దర్శకుడిగా కల్యాణకృష్ణ పేరు కూడా వేయలేదు.

అటు యూవీ క్రియేషన్స్ బ్యానర్ మాత్రం చిరంజీవితో సినిమాను పక్కాగా ప్రకటించింది. 'బింబిసార' ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్టు ఎనౌన్స్ చేసింది. దీనికి సంబంధించి కాన్సెప్ట్ పోస్టర్ కూడా విడుదల చేసింది. పంచభూతాలకు శక్తిచక్రంలో చూపిస్తూ ఆసక్తికరంగా పోస్టర్ తయారుచేశారు.

ఇలా ఒకేసారి చిరంజీవి నుంచి 2 సినిమాల ప్రకటనలు వచ్చేశాయి. అయితే వీటిలో ముందుగా సెట్స్ పైకి వచ్చేది మాత్రం గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్ మూవీనే. కెరీర్ లో చిరంజీవి156వ చిత్రం ఇది. వశిష్ఠ దర్శకత్వంలో చిరంజీవి చేయబోయేది 157వ చిత్రం.