వంద శాతం ఆక్యుపెన్సీ.. నరమేధం బెటర్ కదా

రాష్ట్రాల్లో ఇంకా కరోనా కేసులు తగ్గలేదు. దేశవ్యాప్తంగా పరిస్థితి ఒకేలా ఉంది. పొరుగునే ఉన్న తమిళనాడులో కూడా ఇదే పరిస్థితి. అయినప్పటికీ థియేటర్లలో ఆక్యుపెన్సీని 50శాతం నుంచి వంద శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది…

రాష్ట్రాల్లో ఇంకా కరోనా కేసులు తగ్గలేదు. దేశవ్యాప్తంగా పరిస్థితి ఒకేలా ఉంది. పొరుగునే ఉన్న తమిళనాడులో కూడా ఇదే పరిస్థితి. అయినప్పటికీ థియేటర్లలో ఆక్యుపెన్సీని 50శాతం నుంచి వంద శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది అక్కడ ప్రభుత్వం. ఈ నిర్ణయాన్ని కోలీవుడ్ కు చెందిన అరవింద్ స్వామి సినీప్రముఖులతో పాటు చాలామంది వ్యతిరేకిస్తున్నారు.

ఈ క్రమంలో తమిళనాడుకు చెందిన ఓ లోకల్ డాక్టర్ అరవింద్ శ్రీనివాస్ పెట్టిన ఓ పోస్ట్ అందర్నీ ఎంతగానో టచ్ చేస్తోంది. డబ్బు కోసం, నలుగురి మెప్పు కోసం తీసుకున్న నిర్ణయం.. వేల మంది వైద్యులు పడిన కష్టాన్ని బుగ్గిపాలు చేస్తోందని ఆరోపిస్తూ, సదరు వైద్యుడు రాసిన ఓపెన్ లెటర్ అందర్నీ ఆలోచింపజేస్తోంది.

“ప్రియమైన నటులు విజయ్ సర్, సిలంబరసన్ (శింబు) సర్ మరియు గౌరవనీయ తమిళనాడు ప్రభుత్వం….

నేను అలసిపోయాను. మేమంతా అలసిపోయాం. నాలాంటి వేలాది మంది వైద్యులు అలసిపోయారు. హెల్త్ కేర్ వర్కర్స్ అలసిపోయారు. పోలీసు అధికారులు అలసిపోయారు. శానిటరీ కార్మికులు అలసిపోయారు. కరోనా వల్ల జరిగిన నష్టాన్ని సాధ్యమైనంత తక్కువ చేయాలని మేమంతా క్షేత్రస్థాయిలో ఇన్నాళ్లూ చాలా కష్టపడ్డాం.

మేము మా పనికి గొప్పగా ఫీల్ అవ్వడం లేదు. ఎందుకంటే దాని గురించి అంత గొప్పగా ఏమీ లేదు. మా ముందు కెమెరాలు లేవు. మేము స్టంట్ విన్యాసాలు చేయం. మేము హీరోలం కాదు. కానీ మాకు కొంచెం ఊపిరి తీసుకునే సమయం ఇవ్వండి. దానికి మేం అర్హులమని భావిస్తున్నాం. ఒకరి స్వార్థానికి, దురాశకు మనం బలైపోకూడదు.మహమ్మారి ఇంకా ముగియలేదు. ఈరోజుకీ ప్రజలు కరోనా బారినపడి చనిపోతున్నారు.

వంద శాతం థియేటర్ ఆక్యుపెన్సీ ఆత్మహత్యాసదృశం. బదులుగా నరమేధం చేస్తే సరిపోయేది. ఈ పాలసీలు రూపొందించేవాళ్లు, సినిమా హీరోలు ఎవ్వరూ జనం మధ్య, తోసుకుంటూ వెళ్లి సినిమా చూడరు. ఇదొక నికృష్టమైన వ్యవస్థ. డబ్బు కోసం జీవితాలతో వ్యాపారం చేస్తున్నారు.

థియేటర్లలో వందశాతం ఆక్యుపెన్సీ ఇచ్చేబదులు, అంతా కలిసి ఇంకాస్త శ్రమంచి వైరస్ ను అడ్డుకునేందుకు ఓ విధానాన్ని తయారుచేయలేమా? ఎగసిపడుతున్న మంటల్ని కాస్త చల్లార్చలేమా? మనం ఇంకా ప్రమాదంలోనే ఉన్నామని ఈ పోస్టులో శాస్త్రీయంగా చెప్పాలనుకున్నాను. కానీ ఇదంతా చూసిన తర్వాత “నాకు అవసరమా” అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను.

ఇట్లు..
బాగా అలిసిపోయిన ఓ స్థానిక వైద్యుడు

ప‌వ‌న్ పిలిచి సినిమా చేయ‌మ‌న్నారు

టీడీపీ తొట్టిగ్యాంగ్ పది మంది చూసే ఛానల్స్ అవి