Advertisement

Advertisement


Home > Movies - Movie News

మహేష్ మళ్లీ తప్పుకున్నాడు.. చిరు వచ్చాడు!

మహేష్ మళ్లీ తప్పుకున్నాడు.. చిరు వచ్చాడు!

థర్డ్ వేవ్ కారణంగా రిలీజ్ డేట్స్ లొల్లి మరోసారి మొదలైంది. పెద్ద సినిమాల నిర్మాతలు విడుదల తేదీలపై ఇప్పటికీ మల్లగుల్లాలు పడుతున్నారు. ఇలాంటి టైమ్ లో ఓ కీలక మార్పు చోటుచేసుకుంది. ఆల్రెడీ మహేష్ బాబు ప్రకటించిన తేదీకి చిరంజీవి వస్తున్నాడు. అంటే.. మహేష్ తప్పుకున్నట్టే.

మహేష్ హీరోగా నటిస్తున్న సర్కారువారి పాట సినిమాను సంక్రాంతి నుంచి పోస్ట్ పోన్ చేసి ఏప్రిల్ 1కి షెడ్యూల్ చేశారు. ఇప్పుడా తేదీకి ఆచార్య వస్తోంది. చిరంజీవి నటించిన ఈ సినిమాను ఫిబ్రవరి 4 నుంచి పోస్ట్ పోన్ చేసి ఏప్రిల్ 1కి షెడ్యూల్ చేశారు. కొత్త రిలీజ్ డేట్ తో ఈరోజు పోస్టర్ రిలీజ్ చేశారు.

నిజానికి ఈ తేదీ మార్పు వ్యవహారం సామరస్యంగానే జరిగింది. సర్కారువారి పాట షూటింగ్ మరోసారి పెండింగ్ లో పడింది. దాదాపు నెల రోజులు షూట్ చేయాల్సి ఉందని తెలుస్తోంది. దీంతో ఏప్రిల్ 1 డెడ్ లైన్ అందుకోవడం కష్టమని తేలిపోయింది. అందుకే ఆ తేదీని మహేష్ ఇలా వదులుకోవడం, చిరు అలా అందుకోవడం చకచకా జరిగిపోయాయి.

రిలీజ్ డేట్ విషయంలో చిరంజీవి ఈసారి కాస్త ముందుగానే జాగ్రత్తపడినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే, ఆచార్య సినిమాను డిసెంబర్ లో రిలీజ్ చేయాలనుకునే టైమ్ కే పుష్ప డేట్ వచ్చేసింది. సంక్రాంతికి వద్దామనుకున్న టైమ్ కే 2 పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ వచ్చేశాయి. ఈసారి అలాంటి 'కర్చీఫ్' వ్యవహారాలకు తావివ్వకుండా అందరికంటే ముందే చిరంజీవి డేట్ లాక్ చేసి, ఇండస్ట్రీకి అధికారికంగా సమాచారం ఇచ్చినట్టయింది.

ఏప్రిల్ 1 నుంచి లాంగ్ వీకెండ్ స్టార్ట్ అవుతోంది. ఆచార్య లాంటి సినిమాలకు అది బాగా పనికొస్తుంది. అందుకే చిరంజీవి ఈసారి అందరికంటే ముందే జాగ్రత్తపడ్డారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?