Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఆయేషాకు ప్రియ‌మ‌ణి గ‌ట్టి కౌంట‌ర్‌

ఆయేషాకు ప్రియ‌మ‌ణి గ‌ట్టి కౌంట‌ర్‌

ముస్త‌ఫారాజ్‌తో త‌న వివాహ బంధంపై తాజా వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌పై హీరోయిన్ ప్రియ‌మ‌ణి ఘాటుగా స్పందించారు. అస‌లు త‌న‌తో విడాకులు తీసుకోకుండా ప్రియ‌మ‌ణి-ముస్త‌ఫారాజ్ చ‌ట్ట‌ప‌రంగా దంప‌తులు కాలేర‌ని, వారి మూడుముళ్ల బంధం చెల్ల‌ద‌ని ... ముస్త‌ఫారాజ్ మొద‌టి భార్య ఆయేషా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.

ఈ వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్న నేప‌థ్యంలో ప్రియ‌మ‌ణి సీరియ‌స్‌గా స్పందించారు. ఎవ‌రెన్ని విమ‌ర్శ‌లు చేసినా త‌మ మ‌ధ్య అనుబంధం ఎప్ప‌టికీ చెరిగిపోద‌ని ఆమె గ‌ట్టి స‌మాధానం ఇచ్చారు. వ్యాపార‌వేత్త ముస్త‌ఫారాజ్‌ను ప్రియ‌మ‌ణి 2017లో ప్రేమ పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం న‌టిగా ప్రియ‌మ‌ణి చేసిన చిత్రాలు హిట్ కొట్టిన నేప‌థ్యంలో.... ఎక్క‌డ చూసినా ఆమె పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది.

త‌మ వివాహ బంధంపై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌పై ఆమె తాజా స్పంద‌న ఏంటో తెలుసుకుందాం.

ముస్తఫారాజ్‌తో తన వైవాహిక‌ జీవితం ఎంతో ఆనందంగా కొనసాగుతోందని ప్రియమణి అన్నారు. ముస్తఫాకు తనంటే ఎంతో ఇష్టమని ఆమె పేర్కొన్నారు. ఏ ఇద్ద‌రి మ‌ధ్య అయినా బంధం బ‌ల‌ప‌డాలంటే ....వాళ్లిద్ద‌రూ ప‌ర‌స్ప‌రం ప్రేమ‌గా మాట్లాడుకోవాల‌న్నారు. ముస్తఫాతో నా బంధం మరింత ధృడంగా మారడానికి కారణం ...ఒక‌రికొక‌రం మాట్లాడుకునేందుకు, అభిప్రాయాల‌ను పంచుకోడానికి కొంత స‌మ‌యం కేటాయించ‌డం అని ఆమె చెప్పుకొచ్చారు.

వ్యాపారపనుల నిమిత్తం ఇటీవల ముస్తఫా అమెరికా వెళ్లారన్నారు. ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ప్రతిరోజూ సాయంత్రం త‌న‌కు వీడియో కాల్‌ చేసి మాట్లాడుతున్నాడ‌న్నారు. తాను కూడా షూటింగ్స్‌లో ఉన్నా ముస్త‌ఫా కోసం సమయం కేటాయిస్తానని ప్రియ‌మ‌ణి వెల్ల‌డించారు. 

ఒకవేళ ఇద్దరికీ సమయం కుదరనప్పుడు.. క‌నీసం మెస్సేజైనా పెట్టుకుంటామ‌న్నారు. కాబట్టి ఎవరెన్ని ఆరోపణలు చేసినా.. త‌మ‌ మధ్య అనుబంధం ఎప్పటికీ చెరిగిపోద‌ని ప్రియమణి ధీమాగా చెప్పారు. ఆయేషా ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ప్రియ‌మ‌ణి స్పంద‌న సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌కు దారి తీస్తోంది. ప్రియ‌మ‌ణి స్పంద‌న‌పై ఆయేషా ఎలా స్పందిస్తారో చూడాల్సి వుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?