Advertisement

Advertisement


Home > Movies - Movie News

బాలయ్య మాట వింటే కోటి ఖర్చు అదనం

బాలయ్య మాట వింటే కోటి ఖర్చు అదనం

ఈ నెల మొదటి వారంలో టర్కీ వెళ్లాలి మైత్రీ మూవీస్-బాలయ్య కాంబినేషన్ సినిమా షూటింగ్ కోసం. కానీ గిల్డ్ బంద్ కారణంగా ఆగిపోయారు. 

ఇంతలో బాలయ్య సోదరి ఆకస్మికంగా కాలం చేసారు. దీంతో ఈ శనివారం వరకు బాలయ్య ఇంటికే పరిమితం అయ్యారు. ఇప్పుడు రెడీ, షూటింగ్ కు పదండి అంటున్నారు. బాలయ్య ఇలా ఆదేశాలు ఇవ్వడంతో మైత్రీ మూవీస్ కు రెండు సమస్యలు ఎదురయ్యాయి.

అటు పక్కన గిల్డ్ బంద్..అదో సమస్య. రెండోది ఇప్పటికిప్పుడు టర్కీకి టికెట్ లు యూనిట్ కు అందరికీ తీయాలంటే రెగ్యులర్ రేట్ల కన్నా అదనపు రేట్లు పెట్టాల్సి వస్తుందట. ఈ అదనపు భారం కోటి రూపాయలకు పైనే వుంటుందట. అయితే ఈ విషయం బాలయ్యకు ఎలా చెప్పాలి? ఎలా నచ్చ చెప్పాలి అని కిందా మీదా అవుతున్నారట.

అసలే ఈ సినిమాకు దర్శకుడు మామూలుగా ఖర్చు చేయించడం లేదని, చాలా భారీగా ఖర్చవుతోందని టాక్ వుంది. ఇప్పుడు దాని మీద మరో కోటి రూపాయల భారం అంటే మామూలు విషయం కాదు కదా. 

టర్కీని అమెరికాగా చూపిస్తూ, అక్కడ ఫ్యాక్షనిస్టుల ఫైట్, ఆ ఫైట్ లో హీరో మరణం సీన్ వగైరాలు తీయాల్సి వుంది. బాలయ్యను ఒప్పించి ఆగుతారో, లేదా కోటి అదనపు వ్యయం భరించి వెళ్తారో చూడాల్సి వుంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?