Advertisement

Advertisement


Home > Movies - Movie News

గాన గంధ‌ర్వుడికి క‌రోనా

గాన గంధ‌ర్వుడికి క‌రోనా

గాన గంధ‌ర్వుడు ఎస్పీ బాల‌సుబ్ర‌మ‌ణ్యానికి క‌రోనా పాజిటివ్ అని తేలింది. నిన్న‌టికి నిన్న పాస్ సింగ‌ర్ స్మిత దంప‌తులు క‌రోనా బారిన ప‌డిన విష‌యం తెలిసిందే. క‌రోనా విజృంభిస్తున్న నేప‌థ్యంలో సామాన్యులు మొద‌లుకుని సెల‌బ్రిటీల వ‌ర‌కు ఆ మ‌హ‌మ్మారి ఎవ‌రినీ విడిచి పెట్ట‌డం లేదు.

టాలీవుడ్ ప్ర‌ముఖ డైరెక్ట‌ర్లు రాజ‌మౌళి, తేజ త‌దిత‌ర సెల‌బ్రిటీలు ఇప్ప‌టికే క‌రోనాతో హోం క్వారంటైన్‌లో ఉంటూ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప్ర‌ముఖ సినీ గాయ‌కుడు ఎస్పీ బాల‌సుబ్ర‌మ‌ణ్యం క‌రోనాబారిన ప‌డ‌డం సంగీత ప్రియుల‌ను ఆందోళ‌నకు గురి చేస్తోంది. తన‌కు క‌రోనా పాజిటివ్ అనే విష‌యాన్ని ఎస్పీ బాలూనే స్వ‌యంగా  వీడియో ద్వారా ప్ర‌పంచానికి చెప్పారు.

రెండు రోజులుగా జ్వరం ,దగ్గుతో బాధపడుతుండ‌డంతో  వైద్య పరీక్షలు చేయించుకున్న‌ట్టు చెప్పుకొచ్చారు. ఆ ప‌రీక్ష‌ల్లో  కరోనా పాజిటివ్ అని  నిర్ధారణ అయిందన్నారు. అయితే కరోనా వైరస్ తీవ్రత చాలా తక్కువగా ఉందని, తన అభిమానులు, శ్రేయోభిలా షులు ఆందోళన చెంద‌వ‌ద్ద‌ని ఆయ‌న ధైర్యాన్ని నింపే ప్ర‌య‌త్నం చేశారు. ప్రస్తుతం త‌న‌ ఆరోగ్యంపై ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. అంద‌రి అశీస్సులతో త్వ‌ర‌గా కోలుకుంటానని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆశా భావం వ్య‌క్తం చేశారు. ఎస్పీ బాబు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ఎప్ప‌ట్లానే సంగీత ప్రియుల్ని త‌న గాన మాధుర్యంతో ఓల‌లాడించాల‌ని ప్రార్థిద్దాం. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?