బండ్ల కు ముచ్చటగా మూడోసారి

నిర్మాత, నటుడు బండ్ల గణేష్ వున్న చోట వుండరు. సవాలక్ష వ్యవహారాలు నెత్తిన వేసుకుని, ఎక్కే ఫ్లయిట్..దిగే ఫ్లయిట్ అన్నట్లు తిరిగేస్తుంటారు.  Advertisement కరోనా మొదటి ఫేజ్ లో అందరికన్నా ముందుగా కరోనా బారిన…

నిర్మాత, నటుడు బండ్ల గణేష్ వున్న చోట వుండరు. సవాలక్ష వ్యవహారాలు నెత్తిన వేసుకుని, ఎక్కే ఫ్లయిట్..దిగే ఫ్లయిట్ అన్నట్లు తిరిగేస్తుంటారు. 

కరోనా మొదటి ఫేజ్ లో అందరికన్నా ముందుగా కరోనా బారిన పడిన సెలబ్రిటీ బండ్ల గణేష్ నే. అప్పట్లో చాలా ఇబ్బంది పడ్డారు. ఒకసారి సోకిన వారికి మళ్లీ సోకదు అనుకుంటే రెండో ఫేజ్ లో కూడా కరోనా బారిన పడ్డారు. అప్పుడు మైల్డ్ సింప్టమ్స్ తో తగ్గిపోయింది.

ఇప్పుడు మూడోసారి కూడా బండ్లకు కరోనా సోకింది. మూడు రోజులు పాటు ఢిల్లీలో వున్న బండ్ల హైదరాబాద్ వచ్చాక పరిక్ష చేయంచుకుంటే పాజిటివ్ అని తేలింది. ఇప్పుడు ఇంట్లోనే చికిత్స పొందుతున్నారు. అత్యంత ఖరీదైన RONAPREVE ఇంజ‌క్షన్ ను కూడా వాడుతున్నట్లు తెలుస్తోంది.

ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ఒక్కొక్కరు కరోనా బారిన పడుతున్నారు. నటుడు రాజేంద్ర ప్రసాద్, హీరోయిన్ ఇషాచావ్లా కు కరోనా సోకింది. ఓ యంగ్ మెగా హీరో కు కూడా కరోనా సోకిందని వార్తలు వినిపిస్తోంది. కరోనా కారణంగా ఇండస్ట్రీలో షూటింగ్ ల సంఖ్య రాను రాను తగ్గిపోతోంది.