Advertisement

Advertisement


Home > Movies - Movie News

‘భరతనాట్యం’ ఇంట్రస్టింగ్

‘భరతనాట్యం’ ఇంట్రస్టింగ్

సూర్య తేజ ఏలే తొలిసారి హీరోగా తెరగ్రేటం చేస్తున్న సినిమా 'భరతనాట్యం'. గతంలో దొరసాని సినిమా అందించిన కెవిఆర్ మహేంద్ర దర్శకత్వం వహించారు. పిఆర్ ఫిలింస్ పతాకంపై పాయల్ షరాఫ్ నిర్మించారు. మీనాక్షి గోస్వామి కథానాయిక. ఈ సినిమా వేసవి కానుకగా ఏప్రిల్ 5 న విడుదలకు కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ ముఖ్య అతిధిగా హాజరైన ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకలో హీరోయిన్ శివాత్మిక, జీవిత రాజశేఖర్, నవదీప్, దర్శకులు శ్రీరామ్ ఆదిత్య, విరించి వర్మ, నిర్మాతలు అభిషేక్ అగర్వాల్, మధుర శ్రీధర్, లగడపాటి శ్రీధర్ అతిథులుగా పాల్గొన్నారు.

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ..'భరతనాట్యం' ప్రమోషనల్ కంటెంట్ చాలా ఇంట్రస్టింగ్ గా వుంది. క్రైమ్ కామెడీ నా ఫేవరేట్ జోనర్. చాలా ఆసక్తికరమైన కథ ఇది. చాలా మంది ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ సినిమాకి పని చేస్తున్నారు. వివేక్ సాగర్ చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. 'భరతనాట్యం' సినిమా కూడా సూర్య తేజ తో పాటు సినిమా యూనిట్ అందరికీ చాలా మంచి పేరు తీసుకొస్తుంది. కెవిఆర్ మహేంద్ర ని మా అన్నలా భావిస్తాను. ధని ఏలే గారు పాతికేళ్ళు గా అద్భుతమైన వర్క్ చేస్తున్నారు. మన ఇండస్ట్రీ బావుండాలి. మనమంతా బావుండాలి' అన్నారు.

హీరో సూర్య తేజ ఏలే మాట్లాడుతూ.. ఒక సినిమా అవ్వాలంటే నేచర్ సపోర్ట్ చేయాలని మా దర్శకుడు చెప్పేవారు. మా సినిమాకి ఆ నేచర్ హితేష్. ఆయన వలనే ఈ సినిమా సాధ్యపడింది. మాపై చాలా నమ్మకంతో ఈ సినిమా చేశారు. 'భరతనాట్యం' మా టీం సమిష్టి కృషి. వివేక్ సాగర్ అద్భుతమైన మ్యూజిక్ అందించారు. ఆయన మా సినిమాకి చేయడం మా అదృష్టం. మా నాన్న ధని ఏలే పాతికేళ్ళుగా పరిశ్రమలో వున్నారు. పరిశ్రమలో ఆయన అందరిప్రేమని సంపాదించారు. డైరెక్షన్ టీంతో పాటు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. సినిమా ఏప్రిల్ 5న వస్తోంది. తప్పకుండా థియేటర్స్ లో చూడండి. సినిమా ఖచ్చితంగా అందరినీ అలరిస్తుంది.' అన్నారు.

దర్శకుడు కెవిఆర్ మహేంద్ర మాట్లాడుతూ.. ఆనంద్, శివాత్మిక ఈ వేదికపై వుండటం చాలా ఆనందంగా వుంది. దొరసాని సినిమా విజయంలో వారు ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేను. సూర్య తేజ, మీనాక్షి 'భరతనాట్యం'తో వస్తున్నారు. అదే మ్యాజిక్ జరగబోతుంది. 'భరతనాట్యం' సినిమాని చాలా ఎంటర్ టైనింగ్ హ్యుజ్ వరల్డ్ క్రియేట్ చేసి చెప్పడం జరిగింది. ఎక్కడకూడా కొత్త హీరో సినిమాలా అనిపించదు. సినిమా మొదలైన ఐదు నిమిషాల తర్వాత ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోతారు ఇది నా ప్రామిస్'' అన్నారు.

సీనియర్ నటి జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ..‘దొరసాని’ సినిమాలో చేసిన ఆనంద్, శివాత్మిక, మహేంద్ర.. వీరందరినీ ఒక్క చోట చూడటం చాలా ఆనందంగా వుంది. మహేంద్ర గారి వర్క్ ని చాలా ఇష్టపడతాను. తను అనుకున్నది స్క్రీన్ పైకి తీసుకొచ్చారు. సూర్య చాలా ప్రతిభావంతుడు అన్నారు.

హీరోయిన్ శివాత్మిక మాట్లాడుతూ.. ఈవేడుకకు రావడం చాలా ఆనందంగా వుంది. దొరసాని పాత్ర ఇచ్చిన మహేంద్ర గారికి రుణపడి వుంటాను. ఏప్రిల్ 5న అందరూ భరతనాట్యం చూసి సినిమాకే పెద్ద విజయం ఇవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు

హీరోయిన్ మీనాక్షి గోస్వామి, నిర్మాత పాయల్ షరాఫ్, హీరో నవదీప్, దర్శకులు శ్రీరామ్ ఆదిత్య, విరించివర్మ, నిర్మాతలు అభిషేక్ అగర్వాల్, మధుర శ్రీధర్, డిజైనర్ ధని ఏలే తదితరులు పాల్గొని ప్రసంగించారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?