కలెక్షన్ల సునామీ ఆదిపురుష్ … నిర్మాతలు

ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అంచనాల మధ్య ఈరోజు రిలీజ్ అయిన సినిమా ఆదిపురుష్. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణ మహా గ్రంధం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. రెబల్ స్టార్ ప్రభాస్ రాముడిగా,…

ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అంచనాల మధ్య ఈరోజు రిలీజ్ అయిన సినిమా ఆదిపురుష్. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణ మహా గ్రంధం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. రెబల్ స్టార్ ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా నటించిన ఈ సినిమా విడుదలకు ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ ద్వారా అనేక రికార్డులను బద్దలు కొట్టింది. ఇక ఈరోజు విడుదలైన దగ్గర నుంచి సూపర్ కలెక్షన్స్ సొంతం చేసుకుంటుంది. 550 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమాకి మార్నింగ్ షో నుంచే మంచి రెస్పాన్స్ వస్తూ ఉండటంతో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ని ఈరోజు సాయంత్రం నిర్వహించారు.

ఈ సందర్బంగా మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ శశి మాట్లాడుతూ…”మేము మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్.ఎల్.పి వైజాగ్ లో పెట్టి ఇంచుమించు ఇది ఆరో నెల. మేము ఆది పురష్ సినిమా మా ప్రయత్నం చేస్తే వచ్చింది అనేదానికన్నా, ఆ రాముడు భక్తుడిగా మా మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్లను ఎంచుకున్నారు అనేది మా నమ్మకం. ఫ్యామిలీస్ కూడా ఎక్కువగా వస్తున్నారు. నైజాంలో మల్టీప్లెక్స్ పరంగా చూస్తే 1000 స్క్రీన్ కి పైగా ప్రదర్శించిన సినిమా ఇదే. ఇంతకుముందు ఏ సినిమా కి కూడా ఇలా జరగలేదు. ఖచ్చితంగా ఫస్ట్ వీక్ ఆల్ టైం రికార్డ్ ఈ సినిమా సాధిస్తుంది అని మేము భావిస్తున్నాము. ఈ అవకాశం నాకు ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు” అని తెలియజేశారు.

పీపుల్స్ మీడియా కృతి ప్రసాద్ మాట్లాడుతూ “మీరు ఇచ్చిన సపోర్ట్ కి ధన్యవాదాలు. మీరు ఇంకా ఈ సినిమా చూడకపోతే తప్పకుండా మీ ఫ్యామిలీతో కలిసి థియేటర్స్ లో ఈ సినిమా చూడండి”. అని తెలియజేశారు.

వివేక్ కుచిబొట్ల మాట్లాడుతూ.. “ఈ సినిమా మాకు రావడానికి ముఖ్య కారణమైన యువి వంశీ , విక్కీకి, ప్రమోద్ కి ప్రత్యేకమైన ధన్యవాదములు. అలాగే ఈ సినిమా మేము చేసిన వెంటనే ప్రభాస్ ను కలవడం జరిగింది. కలిసినప్పుడు ఆయన ఒక కొత్త టైపులో ట్రై చేశాము త్రీడీలో చాలా బాగుంటుంది అని చెప్పారు. ఇక ఈరోజు సేమ్ అన్ని ఏరియాస్ నుంచి ప్రేక్షకులు అదే చెప్తున్నారు. త్రీడీ చాలా ఎంజాయ్ చేస్తున్నామని తెలియజేస్తున్నారు. ఈ సినిమాకి ఎక్కడా లేనన్ని మార్నింగ్ షోలు, ఎర్లీ మార్నింగ్ షోస్ పడ్డాయి. ప్రతి షో హౌస్ ఫుల్ అయింది. ఒక అవెంజర్స్, ఒక హాలీవుడ్ సినిమా ఎలా ఉంటుందో అంతా గొప్పగా గ్రాఫిక్స్ తో ఈ సినిమాని దర్శకుడు తీశారు. మన రామాయణ కథ తర్వాత తరాల వారికి అలానే ఇప్పుడు జనరేషన్ కి చాలా సులభంగా అర్థమయ్యేలాగా తీసి దర్శకుడు గొప్ప ప్రయత్నం చేశారు అన్నారు.

ఈ సక్సెస్ మీట్ కి యు.వి. క్రియేషన్స్ వంశీకృష్ణ రెడ్డి కూడా అటెండ్ అయ్యారు.