బుట్టబొమ్మ సెట్స్ పైకొచ్చింది

లాక్ డౌన్ తో 6 నెలల పాటు ఇంటికే పరిమితమైన పూజా హెగ్డే ఎట్టకేలకు సెట్స్ పైకొచ్చింది. నిన్న ముంబయి నుంచి హైదరాబాద్ కు సర్వజాగ్రత్తలతో ల్యాండ్ అయిన ఈ బుట్టబొమ్మ.. ఈరోజు మోస్ట్…

లాక్ డౌన్ తో 6 నెలల పాటు ఇంటికే పరిమితమైన పూజా హెగ్డే ఎట్టకేలకు సెట్స్ పైకొచ్చింది. నిన్న ముంబయి నుంచి హైదరాబాద్ కు సర్వజాగ్రత్తలతో ల్యాండ్ అయిన ఈ బుట్టబొమ్మ.. ఈరోజు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సెట్స్ పైకి వచ్చింది. దాదాపు 7 నెలల సుదీర్ఘ విరామం తర్వాత అఖిల్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా సెట్స్ పైకి వచ్చింది.

నిజానికి ఈ సినిమా షూటింగ్ కోసం అఖిల్ సిద్ధంగా ఉన్నాడు. తండ్రి నాగార్జున, అన్న నాగచైతన్య ఆల్రెడీ సెట్స్ పైకి వచ్చేయడంతో అఖిల్ కూడా తను రెడీగా ఉన్నట్టు యూనిట్ కు సమాచారం అందించాడు. అయితే అఖిల్ మాత్రం వస్తే సరిపోదు. పూజా హెగ్డే కూడా రావాలి. అందుకే ఆమె రాక కోసం ఎదురుచూసిన యూనిట్, ఈరోజు కొత్త షెడ్యూల్ మొదలుపెట్టింది.

ఈ సినిమాతో పాటు ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధేశ్యామ్ మూవీ కూడా పూజా హెగ్డే చేతిలో ఉంది. రాధేశ్యామ్ కూడా ఈ నెలలోనే సెట్స్ పైకి రాబోతోంది. దీని కోసం రామోజీ ఫిలింసిటీలో ప్రత్యేకంగా సెట్ వేశారు.

ఈ రెండు సినిమాలు ఓ కొలిక్కి వస్తే తప్ప, పూజా హెగ్డే అప్ కమింగ్ మూవీస్ పై ఓ క్లారిటీ రాదు. ఏ సినిమాకు ఎప్పట్నుంచి కాల్షీట్లు ఇవ్వాలి, ఎన్ని ఇవ్వాలి లాంటి అంశాలపై ఇప్పుడు పూజా హెగ్డేకు ఓ అవగాహన వస్తుంది. జీఏ-2 పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు. సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.

నాకు లవ్ స్టోరీలు నచ్చవు.. హెబ్బా

ఆ జోష్ వైసీపీకి ఇప్పట్లో వస్తుందా?