Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఫుల్ జోష్ లో 'పండగ' ప్రచారం

ఫుల్ జోష్ లో 'పండగ' ప్రచారం

ప్రతిరోజూ పండగే. గీతా-యువి కలిసి నిర్మిస్తున్న లేటెస్ట్ సినిమా. మారుతి దర్శకుడు. సాయితేజ్-రాశీఖన్నాల జోడి. ఈ సినిమా  ముందు నుంచి ప్లాన్డ్ గా షెడ్యూలు చేసుకుంటూ రావడంతో విడుదలకు రెండు వారాలకు ముందే ఫస్ట్ కాపీ రెడీ అయిపోయింది. సెన్సారు కు ఫుల్ ఫైనల్ కాపీనే అందించేంత అవకాశం కుదిరింది. ఇలాంటి నేపథ్యంలో భారీ ప్రచారానికి తెరతీసారు.

సినిమా హీరో, డైరక్టర్, యూనిట్ కలిసి విశాఖ నుంచి రోడ్ షో లు ప్రారంభించారు. విశాఖలో బయలుదేరి, గాజువాక, అనకాపల్లి, నక్కపల్లి, పాయకరావుపేట, అన్నవరం మీదుగా కాకినాడకు చేరారు.

అటు విశాఖలో ఇటు కాకినాడలో మీడియా మీట్ లు నిర్వహించారు. మిగిలిన ప్రతి చోటా ఫ్యాన్స్ మీట్ లో రోడ్ సైడ్ నే నిర్వహించారు. మెగా ఫ్యాన్స్ కు కొరత లేకపోవడంతో, ప్రతి చోటా రోడ్లపై ట్రాఫిక్ జామ్ లు, బాణాసంచాలు, మెగా నినాదాలతో హడావుడి నెలకొంది.

కాకినాడ నుంచి మళ్లీ బయల్దేరి రామచంద్రపురం, మండపేట, రావులపాలెం, తణుకు, ఏలూరు మీదుగా రాత్రికి విజయవాడ చేరారు. విజయవాడలో ఫ్యాన్స్ మీట్, మీడియా మీట్ నిర్వహించిన తరువాత యాత్రను ఆదివారం కొనసాగిస్తారు.

సినిమాకు ఓపెనింగ్స్ కీలకం. అలాంటి ఒపెనింగ్స్ కు ఇలాంటి యాత్రలు పనికివస్తాయి. మరోపక్కన బస్ లో గ్యాప్ చూసుకుని, మీడియా ఇంటర్వూలు కూడా ప్లాన్ చేసుకుంటూ టైమ్ సేవ్ చేసుకున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?