2020 క‌రోనా విజేత‌గా నిలిచిన ప్ర‌పంచ‌ సుంద‌రి

1994లో ప్ర‌పంచ సుంద‌రిగా ఎవ‌రు ఎంపిక‌య్యారంటే…వెంట‌నే ఐశ్వ‌ర్య‌రాయ్ అనే స‌మాధానం వ‌స్తుంది. మ‌రి 2020లో క‌రోనాను గెలిచిన ప్ర‌పంచ అంద‌గ‌త్తె ఎవ‌రంటే…ఇప్పుడు కూడా ఐశ్వ‌ర్య‌రాయ్ పేరే చెప్పాలి. ఎందుకంటే క‌రోనా బారిన‌ప‌డిన ఆమె…దాని నుంచి…

1994లో ప్ర‌పంచ సుంద‌రిగా ఎవ‌రు ఎంపిక‌య్యారంటే…వెంట‌నే ఐశ్వ‌ర్య‌రాయ్ అనే స‌మాధానం వ‌స్తుంది. మ‌రి 2020లో క‌రోనాను గెలిచిన ప్ర‌పంచ అంద‌గ‌త్తె ఎవ‌రంటే…ఇప్పుడు కూడా ఐశ్వ‌ర్య‌రాయ్ పేరే చెప్పాలి. ఎందుకంటే క‌రోనా బారిన‌ప‌డిన ఆమె…దాని నుంచి కోలుకుని క‌రోనా విజేత‌గా నిలిచారు. ఐశ్వ‌ర్య‌రాయ్‌తో పాటు ఆమె కూతురు ఆరాధ్య కూడా కోలుకుని ముంబ‌య్ ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ్ కావ‌డం అమితాబ్ అభిమానుల‌కి ఎంతో సంతోషాన్ని ఇస్తోంది.

బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బ‌చ్చ‌న్ కుటుంబంలో జ‌యాబ‌చ్చ‌న్ మిన‌హా మిగిలిన కుటుంబ స‌భ్యులు అమితాబ్‌, అభిషేక్‌, ఐశ్వ‌ర్య‌, ఆరాధ్య క‌రోనా బారిన ప‌డ్డారు. కొన్ని రోజులుగా వీరంతా ముంబైలోని నానావ‌తి ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా ఐశ్వ‌ర్య‌, ఆమె కూతురు ఆరాధ్యల‌కు నిర్వ‌హించిన వైద్య ప‌రీక్ష‌ల్లో నెగ‌టివ్ వ‌చ్చిన‌ట్టు నిర్ధార‌ణ అయింది. ఈ విష‌యాన్ని అభిషేక్ బ‌చ్చ‌న్ తెలిపారు.

అభిషేక్ బ‌చ్చ‌న్ ట్విట‌ర్‌లో స్పందిస్తూ …”మేము కోలుకోవాల‌ని కాంక్షిస్తూ మీరంతా చేసిన ప్రార్థ‌న‌లు ఫ‌లించాయి. మాపై మీరు చూపించే ప్రేమ‌కి ధ‌న్య‌వాదాలు. మీకు ఎప్ప‌టికీ రుణ‌ప‌డి ఉంటాం. ఐశ్వ‌ర్య‌రాయ్, ఆరాధ్యల‌కి నెగెటివ్ అని తేలింది. వారిద్ద‌రూ డిశ్చార్జ్ అయ్యారు.  నేను, నా తండ్రి  చికిత్స పొందుతున్నాం” అని అభిషేక్ వివ‌రించారు. 

నిజానికి అమితాబ్‌, ఆయ‌న కుమారుడు అభిషేక్‌లు ముందుగా క‌రోనా బారిన ప‌డ్డారు. ఆ త‌ర్వాత ఐశ్వ‌ర్య‌, కూతురు ఆరాధ్య‌ల‌కు క‌రోనా పాజిటివ్ అని తేలింది. త‌ల్లీకూతుళ్లు త్వ‌ర‌గా కోలుకోవ‌డంతో బాలీవుడ్ హ‌ర్షం వ్య‌క్తం చేస్తోంది.

నా దేవుడ్ని చూస్తే మాటలు రావు