Advertisement

Advertisement


Home > Movies - Movie News

హోస్ట్ అవ‌తారం ఎత్త‌నున్న జ‌గ‌ప‌తిబాబు

హోస్ట్ అవ‌తారం ఎత్త‌నున్న జ‌గ‌ప‌తిబాబు

బుల్లితెరపై హోస్ట్‌లుగా ప్ర‌ముఖ హీరోలు నాగార్జున‌, మెగాస్టార్ చిరంజీవి , జూనియ‌ర్ ఎన్టీఆర్‌, నాని, ఆర్‌కే రోజా త‌దిత‌రులు రాణించిన విష‌యం తెలిసిందే. న‌గ‌రి ఎమ్మెల్యే రోజా మాత్రం ఒక వైపు రాజ‌కీయాలు, మ‌రోవైపు బుల్లితెర‌పై ప‌లు కార్య‌క్ర‌మాల్లో బిజీగా ఉంటూ రెండింటిని స‌మ‌న్వ‌య‌ప‌ర‌చుకుంటూ రాణిస్తున్నారు. ఇప్పుడు వీరి స‌ర‌స‌న సీనియ‌ర్ న‌టుడు జ‌గ‌ప‌తిబాబు చేర‌డానికి ప‌క్కా ప్ర‌ణాళిక‌తో వ‌స్తున్నాడు.

జెమినీ టీవీలో ఓ గేమ్ షోకి హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించేందుకు ఆయ‌న అంగీక‌రించారు. మాటీవీలో "మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు" ప్రోగ్రామ్‌కు నాగార్జున హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించి మంచి పేరు తెచ్చుకున్నాడు. అలాగే బిగ్‌బాస్‌-3 సీజ‌న్‌కు ఆయ‌న హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించిన సంగ‌తి తెలిసిందే. "మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు" సీజ‌న్ 2కు మెగాస్టార్ చిరు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించిన విష‌యం తెలిసిందే.

మాటీవీలో బిగ్‌బాస్ సీజ‌న్‌-1కు జూనియ‌ర్ ఎన్టీఆర్ హోస్ట్ పాత్ర‌లో అద‌రగొట్టాడు. రెండోసీజ‌న్‌కు హీరో నాని వ్య‌వ‌హ‌రించాడు. ఇక హీరోయిన్ల విష‌యానికి వ‌స్తే రోజా ఈటీవీలో ప్ర‌సార‌మ‌య్యే జ‌బ‌ర్ధ‌స్త్ కామెడీ షోకు ఆమె జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రిస్తూ శ‌భాష్ అనిపించుకుంటున్నారు. అలాగే ఇత‌ర చాన‌ళ్ల‌లో కూడా ఆమె హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే.

తాజాగా సీనియ‌ర్ న‌టుడు జ‌గ‌ప‌తిబాబు జెమినీ చాన‌ల్‌లో త్వ‌ర‌లో ప్రారంభ‌మ‌య్యే ఓ గేమ్ షోకి హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించేందుకు సిద్ధ‌మ‌య్యాడు. స‌హ‌జంగా సీరియ‌స్ న‌టుడిగా పేరు తెచ్చుకున్న జ‌గ‌ప‌తిబాబు హోస్ట్ పాత్ర‌లో ఎలా ఇమిడిపోతారోన‌నే ఆస‌క్తి స‌ర్వ‌త్రా నెల‌కొంది. 

పరిశ్రమ పరువు తీసేది కాదు, పరువు పెంచేది ఈ సినిమా

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?