Advertisement

Advertisement


Home > Movies - Movie News

కనికాకు కరోనా ఇంకా తగ్గలేదు

కనికాకు కరోనా ఇంకా తగ్గలేదు

బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ కు కరోనా ఇంకా తగ్గలేదు. లక్నోలోని సంజయ్ గాంధీ మెడికల్ కాలేజీలో ఉన్న ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న కనికాకు వరుసగా మూడోసారి పాజిటివ్ వచ్చింది. ఆదివారం నిర్వహించిన పరీక్షలో పాజిటివ్ రాగా, నిన్న రాత్రి వచ్చిన రిపోర్ట్ లో కూడా ఇంకా పాజిటివ్ ఉంది. దీంతో ఆమెకు ట్రీమ్ మెంట్ కొనసాగించబోతున్నట్టు వైద్యులు ప్రకటించారు.

అయితే కనికాతో పాటు హోటల్ రూమ్ లో ఉన్న ఓజాస్ దేశాయ్ కు నెగెటివ్ వచ్చింది. అయితే ట్రీట్ మెంట్ మాత్రం కొన్నాళ్లు కొనసాగిస్తామని వైద్యులు ప్రకటించారు. ఈ మొత్తం వ్యవహారంలో కొంతమంది రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సినీప్రముఖులు ఊపిరిపీల్చుకున్నారు. వాళ్లందరికీ నెగెటివ్ వచ్చింది.

విదేశాల నుంచి తిరిగొచ్చిన వెంటనే ఇంట్లో ఉండకూడా పెద్ద పార్టీకి వెళ్లింది కనికా. ఆ పార్టీకి చాలామంది రాజకీయ ప్రమఖులు, సెలబ్రిటీలు, బిజినెస్ మేన్ వచ్చారు. ఆ పార్టీ తర్వాత కొంతమంది రాజకీయ నేతలు రాష్ట్రపతి భవన్ కు వెళ్లి చిన్నపాటి విందులో కూడా పాల్గొన్నారు. మరికొంతమంది నేతలు ఉత్తరప్రదేశ్ కేబినెట్ మీటింగ్ లో కూడా పాల్గొన్నారు. ఇవన్నీ జరిగిన తర్వాత కనికాకు పాజిటివ్ అని తేలడంతో దేశం మొత్తం ఉలిక్కిపడింది.

కనికాను క్వారంటైన్ కు తరలించడంతో పాటు ఆరోజు పార్టీకొచ్చిన ప్రముఖులందర్నీ స్వీయ నిర్భంధంలో ఉంచారు అధికారులు. వాళ్లందరికీ పరీక్షలు నిర్వహించగా.. అందరికీ నెగెటివ్ వచ్చింది. కనికాతో దాదాపు 400 మంది టచ్ లోకి వచ్చారని చెబుతున్నారు అధికారులు. వాళ్లలో ఇంకా చాలామందికి పరీక్షలు నిర్వహించాల్సి ఉంది.

21 రోజులు మొత్తం దేశమంతా లాక్ డౌన్

ఆర్మీని తెచ్చి.. షూట్ ఎట్ సైట్ ఆర్డర్ ఇస్తాం

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?