Advertisement

Advertisement


Home > Movies - Movie News

గీతా ఆర్ట్స్ లో కార్తికేయ

గీతా ఆర్ట్స్ లో కార్తికేయ

కార్తికేయ హీరోగా తన బ్యానర్ పై ఓ సినిమా చేస్తానని గతంలోనే ప్రకటించాడు నిర్మాత అల్లు అరవింద్. కొన్నాళ్ల కిందట వచ్చిన గుణ369 సినిమా ఫంక్షన్ కు ప్రత్యేక అతిథిగా వెళ్లిన అరవింద్, అప్పుడే కార్తికేయకు మాటిచ్చాడు. చెప్పినట్టుగానే కార్తికేయ హీరోగా కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది.

గీతాఆర్ట్స్-2 బ్యానర్ పై కార్తికేయ హీరోగా సినిమా ప్రకటన వచ్చేసింది. ఈ మూవీకి చావు కబురు చల్లగా అనే టైటిల్ ఫిక్స్ చేశారు. కౌషిక్ అనే కుర్రాడ్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ బన్నీ వాస్ నిర్మాతగా, అల్లు అరవింద్ సమర్పణలో ఈ సినిమా రాబోతోంది. మూవీలో కార్తికేయ పేరు బస్తీ బాలరాజు. సినిమా సబ్జెక్ట్ ఏంటనేది ఇంకా బయటకు రాలేదు.

వరుసగా యంగ్ హీరోస్ తో సినిమాలు సెట్ చేస్తోంది గీతాఆర్ట్స్-2 బ్యానర్. ఇప్పటికే నిఖిల్ హీరోగా, వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమా ఎనౌన్స్ చేసింది. ఇప్పుడు కార్తికేయ హీరోగా ఇంకో సినిమా. త్వరలోనే రాజ్ తరుణ్ హీరోగా కూడా ఓ సినిమా ప్రకటించబోతోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?