Advertisement

Advertisement


Home > Movies - Movie News

అడివి శేష్ బాటలో అబ్బవరం

అడివి శేష్ బాటలో అబ్బవరం

సినిమా ప్రమోషన్ కొత్త పుంతలు తొక్కింది. తమ సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు రకరకాల పద్ధతులు ఫాలో అవుతున్నారు. ఇందులో భాగంగా మేజర్ సినిమా కోసం ప్రీమియర్స్ వేశాడు అడవి శేష్. విశాఖపట్నం ప్రీమియర్ కోసం ఏకంగా డబ్బులన్నీ తనే పెట్టుకున్నాడు. ఉచితంగా సినిమా చూపించాడు. ఇప్పుడు మరో హీరో కిరణ్ అబ్బవరం కూడా ఇదే పద్ధతి ఫాలో అవుతున్నాడు.

రేపు కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న సమ్మతమే సినిమా రిలీజ్ అవుతోంది. ఈ సినిమా కోసం ఉచిత టికెట్ల కార్యక్రమం ప్రారంభించాడు కిరణ్ అబ్బవరం. ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేసిన ఈ హీరో, ఆ వీడియో కింద కామెంట్స్ లో పేరు, సెల్ నంబర్, దగ్గర్లో ఉన్న సినిమా థియేటర్ వివరాలు చెబితే.. రేపు సమ్మతమే సినిమాను ఉచితంగా చూసేందుకు ఏర్పాట్లు చేస్తానని హామీ ఇచ్చారు.

ఇలా తెలుగు రాష్ట్రాల్లో రేపు చాలామంది ప్రేక్షకులకు ఉచితంగా సినిమా చూపించే ఏర్పాటు చేశాడు ఈ హీరో. దీని వెనక కారణాన్ని కూడా బయటపెట్టాడు.

"టికెట్ రేట్లు ఇంకా ఎక్కువగా ఉన్నాయని ఎవరైనా సమ్మతమే సినిమా చూడకూడదనుకుంటే, అలాంటి వాళ్లకు నేను ఫ్రీగా టికెట్లు ఇస్తాను. వాళ్లు, వీళ్లు చూసి సినిమా ఎలా ఉందో చెప్పడం కాదు, స్వయంగా మీరంతా చూసి సినిమా ఎలా ఉందో చెప్పండి. మీరంతా సినిమాను థియేటర్లలోనే చూడాలనేది నా కోరిక. అందుకే ఇలా ఉచితంగా టికెట్లు ఇస్తున్నాను."

ఇలా ఫ్రీ టికెట్ల వెనక కాన్సెప్ట్ బయటపెట్టాడు కిరణ్ అబ్బవరం. రేపు సమ్మతమే సినిమాతో పాటు ఆకాష్ పూరి హీరోగా నటించిన చోర్ బజార్ సినిమా థియేటర్లలోకి వస్తోంది. వీటితో పాటు మరో 4 సినిమాలు కూడా వస్తున్నాయి. వీటిలో ఏ సినిమాకీ అడ్వాన్స్ బుకింగ్స్ లేవు. అందుకే కిరణ్ అబ్బవరం ఓ అడుగు ముందుకేసి, ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించే ప్రయత్నం చేస్తున్నాడు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?