Advertisement

Advertisement


Home > Movies - Movie News

మరో హీరోయిన్ పెళ్లయిపోయిందోచ్..

మరో హీరోయిన్ పెళ్లయిపోయిందోచ్..

మరో హీరోయిన్ కు పెళ్లయిపోయింది. కియరా అద్వానీ, రకుల్ ప్రీత్ సింగ్, అక్ష, మీరా చోప్రా లిస్ట్ లోకి కృతి కర్బందా కూడా చేరిపోయింది. రాత్రి ఢిల్లీలో ఈమె వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈరోజు తన పెళ్లి ఫొటోల్ని విడుదల చేసింది కృతి కర్బందా.

ఢిల్లీకి సమీపంలో ఉన్న ఐటీసీ గ్రాండ్ భారత్ లో కృతి కర్బందా, పుల్కిత్ పెళ్లి వేడుక జరిగింది. 3 రోజుల పాటు జరిగిన ఈ వివాహ వేడుక కోసం రిసార్ట్ మొత్తాన్ని బుక్ చేసింది ఈ జంట. ఇందులో మొత్తం 104 రూమ్స్ ఉన్నాయి. వీటిలో అత్యంత ఖరీదైన స్వీట్ రూమ్స్ కూడా ఉన్నాయి. ఒక రాత్రికి 35వేల రూపాయల ఖరీదైన రూమ్స్ ఇవి.

వీటన్నింటినీ ఆహుతులకు కేటాయించారు వీళ్లు. అంతేకాదు, వీళ్ల పెళ్లిలో మరో ప్రత్యేకత కూడా ఉంది. ఆహుతుల్లో ఎవరిది ఏ ప్రాంతం, వాళ్లు ఏ భోజనం ఇష్టపడతారనే వివరాల్ని తెలుసుకొని మరీ ఆ రుచుల్ని ప్రత్యేకంగా వడ్డించారట.

కృతి, పుల్కిత్ ఇద్దరూ ఢిల్లీలోనే పుట్టిపెరిగారు. ఇప్పటికీ వాళ్ల కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులంతా ఢిల్లీ చుట్టుపక్కలే ఉన్నారు. అందుకే వెడ్డింగ్ డెస్టినేషన్ లాంటివేం పెట్టుకోకుండా.. ఢిల్లీ శివార్లలోని రిసార్ట్ లో వీళ్లు పెళ్లి చేసుకున్నారు.

నాలుగేళ్లుగా డేటింగ్ లో ఉన్నారు కృతి కర్బందా, పుల్కిత్. ఓ ఏడాది కిందట తమ రిలేషన్ షిప్ ను వీళ్లు బయటపెట్టారు. జనవరిలో కృతి కర్బందా, పుల్కిత్ నిశ్చితార్థం జరిగింది. ఇప్పుడు పెళ్లితో ఈ జంట ఒక్కటైంది. పుల్కిత్ కు ఇది రెండో పెళ్లి.

Click Here Photos

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?