Advertisement

Advertisement


Home > Movies - Movie News

ప్ర‌ధాని మోడీపై ప్ర‌ముఖ న‌టి వెట‌కారం

ప్ర‌ధాని మోడీపై ప్ర‌ముఖ న‌టి వెట‌కారం

తాను చెప్ప‌ద‌ల‌చుకున్న దాన్ని సూటిగా, స్ప‌ష్టంగా, నిర్భ‌యంగా ప్ర‌క‌టించ‌డం ప్ర‌ముఖ సినీ న‌టి ఖుష్బూ నైజం. న‌టిగా ఆమె టాలీవుడ్‌కు కూడా సుప‌రిచితురాలే. త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో కాంగ్రెస్ త‌ర‌పున ఆమె యాక్టీవ్‌గా ఉంటున్నారు. సామాజిక‌, రాజ‌కీయ అంశాల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు స్పందిస్తూ ఘాటైన వ్యాఖ్య‌లు చేస్తూ...ఒక్కోసారి వివాదాల‌కు కేంద్ర బిందువుగా నిలుస్తుంటారు. అయినా వాటిని లెక్క చేయ‌కుండా ఆమె ముందుకు వెళుతుంటారు.

తాజాగా ప్ర‌ధాని మోడీపై ఆమె వ్యంగ్యాస్త్రాలు సంధించారు. త‌న మార్క్ వెట‌కారాన్ని మోడీపై ప్ర‌ద‌ర్శించారు. దీంతో సోష‌ల్ మీడియాలో ఖుష్బూ వ్యాఖ్య‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. రాముడి కంటే మోడీ పెద్ద‌వాడై పోయార‌నే ఖుష్బూ ట్వీట్ స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అస‌లు వివాదం ఎక్క‌డ మొద‌లైందంటే....

అయోధ్య‌లో రాముడి గుడి నిర్మాణానికి ప్ర‌ధాని మోడీ నేడు భూమి పూజ చేసిన విష‌యం తెలిసిందే. మోడీ భూమిపూజ‌కు వ‌స్తున్నార‌న్న‌ప్ప‌టి నుంచి సోష‌ల్ మీడియాలో రాముడు, మోడీ త‌దిత‌రుల‌పై సోష‌ల్ మీడియాలో బాగా  ట్రెండింగ్ అవుతున్నాయి. ఈ నేప‌థ్యంలో బాల రాముడి చేతిని అందిపుచ్చుకుని మందిరం వైపు మోడీ న‌డిపిస్తున్న చిత్రం సోష‌ల్ మీడియాలో కొన్నిరోజులుగా వైర‌ల్ అవుతోంది.

దీనిపై సోషల్ మీడియాలో స‌హ‌జంగా రెండు వ‌ర్గాలుగా విడిపోయి భిన్నాభిప్రాయాల‌ను వ్య‌క్తం చేస్తున్నారు. కొంద‌రు మోడీకి వ్య‌తిరేకంగా, మ‌రికొంద‌రు అనుకూలంగా కామెంట్స్ చేస్తున్నారు.  

కర్ణాటకలోని చిక్మగులూర్ బీజేపీ ఎంపీ శోభ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న స‌ద‌రు  ఫొటోను తన  ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ...తన ప్రియమైన రాజును ఇంటికి తిరిగి స్వాగతించడానికి అయోధ్య సిద్ధంగా ఉందంటూ ట్వీట్ చేశారు.  ఈ ట్వీట్‌ను ప్ర‌ముఖ న‌టి, కాంగ్రెస్ నాయ‌కురాలు ఖుష్బూ షేర్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆమె ‘వావ్.. ఇప్పుడు దేవుడైన‌ రాముడి కంటే మోడీ పెద్దవాడయ్యరన్నమాట. కలియుగం మరి’ అనే భావం వ‌చ్చేలా ట్వీట్ చేశారు. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఖుష్బూ ట్వీట్ వైర‌ల్ కావ‌డం గ‌మ‌నార్హం. 

ఇలా చేస్తే కరోనా రాదు

కరోనా బారిన బాలు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?