Advertisement

Advertisement


Home > Movies - Movie News

పెళ్లి పీఠ‌లెక్క‌నున్న బుల్లితెర ప్ర‌ముఖ న‌టి

 పెళ్లి పీఠ‌లెక్క‌నున్న బుల్లితెర  ప్ర‌ముఖ న‌టి

లాక్‌డౌన్ స‌డ‌లింపు నేప‌థ్యంలో సినీ సెల‌బ్రిటీలు పెళ్లి పీఠ‌లెక్కుతున్నారు. క‌రోనా కార‌ణంగా చాలా మంది త‌మ పెళ్లిళ్ల‌ను వాయిదా వేసుకున్న విష‌యం తెలిసిందే. ముహూర్తాలు పెట్టుకుని, క‌ళ్యాణ వేదిక‌ల‌ను సిద్ధం చేసుకుని కూడా లాక్‌డౌన్ కార‌ణంగా చివ‌రికి పెళ్లిళ్ల‌ను వాయిదా వేసుకోవ‌డం చూశాం.

వెండితెర‌కు సంబంధించి హీరోలు నితిన్‌, రానా త్వ‌ర‌లో పెళ్లి పీఠ‌లు ఎక్క‌నున్న విష‌యం తెలిసిందే. ఇక బుల్లితెర విష‌యానికి వ‌స్తే మ‌ధుబాబు, ప్రియాంక‌లు కూడా త్వ‌ర‌లో వివాహ బంధంతో ఒక్క‌టి కానున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఈ జాబితాలో  బుల్లితెరకు సంబంధించి మ‌రో ప్ర‌ముఖ న‌టి ల‌తా సంగ‌రాజు కూడా చేరారు.

త‌న కాబోయే జీవిత భాగ‌స్వామిని సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆమె ప‌రిచ‌యం చేశారు. త‌న కాబోయే భ‌ర్త‌తో దిగిన ఫొటోల‌ను పోస్ట్ చేస్తూ...ఈ నెల 14న వివాహం చేసుకోనున్న‌ట్టు ఆమె ప్ర‌క‌టించారు. అంత‌కు మించి వివ‌రాలు వెల్ల‌డించ‌లేదు. ప్రీ వెడ్డింగ్ షూట్‌లో ఉన్న వీరిద్ద‌రిని చూసి అభిమానులు మేడ్ ఫ‌ర్ ఈచ్ అద‌ర్ అంటూ కామెంట్స్ పెట్టారు. ల‌తా సంగ‌రాజు తేనె మ‌న‌సులు, రామాసీత త‌దిత‌ర సీరియ‌ల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఒక్క తెలుగులోనే కాకుండా మ‌ల‌యాళం సీరియ‌ల్స్‌లో కూడా ఆమె న‌టిస్తున్నారు. 

వెళ్ళేది ఎవరు? పిలిచేది ఎవరు?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?