మీనాక్షి గెస్ట్ రోల్ మాత్రమేనా?

గుంటూరుకారం సినిమాలో లాస్ట్ ఎంట్రీ మీనాక్షి చౌదరి. మొదటి హీరోయిన్ పూజా హెగ్డే మారిపోవడంతో రెండో హీరోయిన్ గా వున్న శ్రీలీలకు ప్రమోషన్ వచ్చింది. దాంతో రెండో హీరోయిన్ ప్లేస్ లోకి మీనాక్షి చౌదరి…

గుంటూరుకారం సినిమాలో లాస్ట్ ఎంట్రీ మీనాక్షి చౌదరి. మొదటి హీరోయిన్ పూజా హెగ్డే మారిపోవడంతో రెండో హీరోయిన్ గా వున్న శ్రీలీలకు ప్రమోషన్ వచ్చింది. దాంతో రెండో హీరోయిన్ ప్లేస్ లోకి మీనాక్షి చౌదరి వచ్చి చేరింది.

అయితే ఎంతయినా మీనాక్షి పాత్ర చిన్నదే వుంటుందని మొదటి నుంచీ అనుకుంటూనే వున్నారు. అయితే ఓ పాట అయినా వుంటుంది. కొంత నిడివి వుంటుంది అని వినిపిస్తూ వచ్చింది. సాధారణంగా త్రివిక్రమ్ సినిమాల్లో ఇద్లరు హీరోయిన్లు వుంటారు. కానీ రెండో హీరోయిన్ కు పెద్దగా ప్రాధాన్యత వున్న సినిమాలు తక్కువ. కానీ గుంటూరుకారం లో రెండో హీరోయిన్ కు కూడా కాస్త పాత్ర వుంటుందని వార్తలు వినిపించాయి.

అయితే నిన్నటికి నిన్న జరిగిన ప్రీ రిలీజ్ మీట్ లో హీరో మహేష్ బాబు మాట్లాడుతూ మీనాక్షి చేసింది అతిధి పాత్ర అని రీవీల్ చేసేసారు. గెస్ట్ రోల్ కు అడగగానే అంగీకరించినందుకు థాంక్స్ అని చెప్పారు మహేష్. ట్రయిలర్ మీనాక్షి కనిపించింది. ఈ రోజు వదిలిన పాటలో కనిపించింది. ఈ రెండు సీన్లు చూస్తుంటే, సినిమా ప్రారంభంలో వచ్చే పల్లెటూరి ఎపిసోడ్ లో మీనాక్షి వుంటుందనుకోవాలి. కథ టౌన్ కు షిఫ్ట్ అయిన తరువాత అవసరం అయినపుడు మాత్రమే కనిపిస్తుందనుకోవాలి.

గెస్ట్ రోల్ అయినా పెద్ద సినిమాలో, అదీ మహేష్ పక్కన చాన్స్ వచ్చింది కనుక ఇప్పుడు మీనాక్షి మీద అందరి దృష్టి పడుతుంది.