Advertisement

Advertisement


Home > Movies - Movie News

అందరి అనుమానాలు తీర్చిన నాగశౌర్య

అందరి అనుమానాలు తీర్చిన నాగశౌర్య

నాగశౌర్య ఇప్పుడు ఏ సినిమాలు చేస్తున్నాడనే డౌట్ అందర్లో ఉంది. ఎందుకంటే ఆమధ్య భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై రాజు కొలుసు దర్శకత్వంలో సినిమా ఆపేశాడు. సినిమాటోగ్రాఫర్ సాయిశ్రీరామ్ దర్శకత్వంలో చేయాల్సిన సినిమా కూడా ఆపేశాడు. దీంతో పాటు ఓ కొత్త దర్శకుడితో సినిమాను కూడా ప్రకటించకుండానే ఆపేశాడు. దీంతో ఇతడు ఏ సినిమాలు కమిట్ అయ్యాడు, వేటిని సెట్స్ పైకి తీసుకొచ్చాడనే అంశంపై అందర్లో కొన్ని అనుమానాలున్నాయి. వీటిపై స్వయంగా నాగశౌర్య రియాక్ట్ అయ్యాడు.

"ప్రస్తుతం సొంత బ్యానర్ పై అశ్వద్ధామ సినిమా చేస్తున్నాను. అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా కూడా నడుస్తోంది. దానిపేరు ఫలానా అబ్బాయి-ఫలానా అమ్మాయి. 2 షెడ్యూల్స్ అయిపోయాయి. త్వరలోనే పార్థు అనే టైటిల్ తో మరో సినిమా కూడా స్టార్ట్ అవుతుంది. సుబ్రమణ్యపురం డైరక్టర్ సంతోష్ దీన్ని డైరక్ట్ చేస్తాడు."

ఇలా తన అప్ కమింగ్ మూవీస్ పై నాగశౌర్య క్లారిటీ ఇచ్చాడు. ఓ బేబీ సక్సెస్ అయిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన శౌర్య, ఇలా తన కెరీర్ కు సంబంధించిన అనుమానాల్ని కూడా నివృత్తి చేశాడు. రీసెంట్ గా తనకు జరిగిన యాక్సిడెంట్ పై స్పందించిన ఈ హీరో,  సహజత్వం కోసమే రిస్క్ చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు.

"రిస్క్ అవసరమే. హీరో రియల్ గా చేశాడా లేక డూప్ పెట్టారా అనే అంశాన్ని ప్రేక్షకులు చాలా నిశితంగా గమనిస్తున్నారు. పైగా ఇది ఇంటర్వెల్ లో వచ్చే సీన్. దాదాపు 14 నిమిషాల ఎపిసోడ్. ఇలాంటి దగ్గర డూప్ పెడితే ఆడియన్స్ కు ఆ ఫీల్ రాదు. హీరో టెన్షన్ ఆడియన్స్ కు అర్థంకావాలి కదా. అందుకే సొంతంగా చేయడానికి ట్రైచేశాను. 6 నెలలు లేట్ అయినా ఫర్వాలేదు. అది నేనే చేస్తాను."

ఛలో సినిమాకు తనే కథ అందించానని చెప్పుకుంటున్న నాగశౌర్య, ప్రస్తుతం సెట్స్ పై ఉన్న అశ్వద్ధామకు కూడా కథ తనదే అంటున్నాడు. ఛలో సినిమాకు టైటిల్ వేసుకోలేదని, కొత్త సినిమాకు మాత్రం తన టైటిల్ పడుతుందని క్లారిటీ ఇచ్చాడు.

నాగశౌర్య ఫొటోస్ కోసం క్లిక్ చేయండి 

అన్నా.. జగనన్నా.. చేర్చుకో అన్నా!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?