Advertisement

Advertisement


Home > Movies - Movie News

మీరు కలిసే ఉన్నారు.. ఇక ఆపండి చాలు

మీరు కలిసే ఉన్నారు.. ఇక ఆపండి చాలు

హీరోయిన్లు తమ ఫొటోషూట్స్ పెడితే అందరూ చూస్తారు. అదే హీరోయిన్, తన భర్తతో దిగిన ఫొటోల్ని వరుసగా పోస్ట్ చేస్తే మాత్రం చిరాకు పడతారు. ప్రస్తుతం నయనతార నెటిజన్లకు అలాంటి చిరాకునే తెప్పిస్తోంది. ట్విట్టర్ లేదా ఇనస్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు.. భర్త విఘ్నేష్ శివన్ తో నయనతార దిగిన ఫొటోలు ప్రత్యక్షం.

ఇలా భర్తతో దిగిన ఫొటోల్ని వరుసగా పోస్ట్ చేయడం వెనక రీజన్ అందరికీ తెలిసిందే. రీసెంట్ గా వీళ్లిద్దరి బంధంపై పుకార్లు వచ్చాయి. నయనతార, భర్తను దూరం పెట్టినట్టు ఊహాగానాలు చెలరేగాయి. వాటికి చెక్ పెట్టేందుకు, ఇలా అన్యన్యంగా ఉన్న ఫోటోల్ని ఇద్దరూ పోస్ట్ చేస్తున్నారు.

రీసెంట్ గా వీళ్లిద్దరూ ఓ పెళ్లికి హాజరైంది. ఆ టైమ్ లో ఫొటోలు దిగి వాటిని కూడా పోస్ట్ చేశారు. "ఓ పెళ్లికి వెళ్లి వచ్చాం. ఎందుకో మేం కూడా ఇప్పుడే పెళ్లి చేసుకున్న ఫీలింగ్ కలిగింది" అంటూ మరికొన్ని ఫొటోలు పెట్టారు.అయితే ఈ ఫొటోల హడావుడి ఇప్పుడు శృతిమించింది. చూసేవాళ్లకు మొహం మొత్తింది.

నయనతార, విఘ్నేష్ శివన్ దాదాపు 8 ఏళ్లు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. కొడుకులు పుట్టిన తర్వాత వీళ్ల బంధం మరింత బలపడింది. అయితే, కొన్ని రోజులుగా వినిపిస్తున్న పుకార్లు వీళ్లను ఇబ్బంది పెడుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఫలితంగా, నయనతార, భర్తపై తనకున్న ప్రేను ఇలా ఫొటోలతో వ్యక్త పరుస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?