రానున్న ఎన్నికల్లో లోకేశ్ మామ నందమూరి బాలకృష్ణకు దబిడి దబిడేనా అంటే... ఔననే సమాధానం వస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఉమ్మడి అనంతపురం జిల్లా హిందూపురం అంబేద్కర్ సెంటర్లో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. జగన్ ఎన్నికల ప్రచారానికి జనం వెల్లువెత్తారు.
నలు దిక్కులా జనసముద్రాన్ని చూస్తే.... హిందూపురంలో సిటింగ్ ఎమ్మెల్యే బాలయ్య పనై పోయిందనే అభిప్రాయం కలుగుతుంది. హిందూపురం టీడీపీకి కంచుకోట. ఈ దఫా ఎన్నికల్లో చంద్రబాబునాయుడు, బాలకృష్ణ, పవన్కల్యాణ్, లోకేశ్లపై జగన్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నలుగురిని ఓడించేందుకు ప్రత్యేక వ్యూహ రచన చేసినట్టు ప్రచారం జరుగుతోంది.
హిందూపురానికి బాలయ్య చేసిందేమీ లేదు. అయినప్పటికీ హిందూపురంలో ఆయన గెలుస్తున్నారు. ఇందుకు వైసీపీలో అంతర్గత కలహాలు కూడా కారణమయ్యాయి. వాటిని పరిష్కరించడంలో వైసీపీ అధిష్టానం విఫలమైందని అనుకుంటున్న తరుణంలో జగన్ సభకు జనం భారీ సంఖ్యలో రావడంపై ఆ పార్టీనే ఆశ్చర్యపోతోంది. వైసీపీపై ప్రజల్లో మంచి ఆదరణ వుందనేందుకు జగన్ సభకు వచ్చిన జనమే నిదర్శనమే టాక్ వినిపిస్తోంది.
హిందూపురం సభలో జగన్ మాట్లాడుతూ 2.72 లక్షల కోట్ల రూపాయలను సంక్షేమ పథకాలను అందజేసినట్టు తెలిపారు. ఇదే చంద్రబాబు విషయానికి వస్తే... 2014లో చంద్రబాబునాయుడు మేనిఫెస్టో పేరుతో ఎలా మోసగించారో వివరించారు. బాబు పేరు చెబితే ఒక్కటంటే ఒక్క పథకమైనా గుర్తుకు వస్తుందా? అని ఆయన ప్రశ్నించారు.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు