Advertisement

Advertisement


Home > Movies - Movie News

లోక్ సభ ఎన్నికల బరిలో మరో హీరోయిన్?

లోక్ సభ ఎన్నికల బరిలో మరో హీరోయిన్?

ఇప్పటికే కొంతమంది హీరోయిన్లు రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి మరో హీరోయిన్ వచ్చి చేరింది. ఆమె పేరు నేహా శర్మ. రామ్ చరణ్ మొదటి సినిమా చిరుతలో హీరోయిన్ గా నటించిన హీరోయిన్ ఈమె.

నేహా శర్మది రాజకీయ కుటుంబం. ఈమె తండ్రి అజిత్ శర్మ కాంగ్రెస్ నేత. బిహార్ లోని భాగల్ పూర్ సెగ్మెంట్ నుంచి కూతుర్ని నిలబెట్టాలని అజిత్ శర్మ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు ఆయన బహిరంగంగా ప్రకటన కూడా చేశారు.

భగల్ పూర్ నియోజకవర్గం కాంగ్రెస్ కు కంచుకోట. ఈ సెగ్మెంట్ పై అజిత్ కు మంచి పట్టుంది. అయితే పొత్తుల్లో భాగంగా ఇక్కడ ఏ పార్టీకి సీటు దక్కుతుందనేది సస్పెన్స్ గా మారింది. పార్టీ కోరితే తను పోటీ చేస్తానని, లేదంటే తన కూతుర్ని బరిలో నిలబెడతానని ఆయన ప్రకటించారు. మరో 2-3 రోజుల్లో నిర్ణయం వస్తుందని కూడా అన్నారు.

నేహా శర్మ తన కెరీర్ ను 2007లో చిరుత సినిమాతో ప్రారంభించింది, ఇది పెద్ద విజయాన్ని సాధించింది. 2010లో వచ్చిన క్రూక్ సినిమా‌తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అది హిట్టవ్వలేదు. 17 ఏళ్ల నుంచి కెరీర్ కొనసాగిస్తున్న నేహాశర్మ, ఇప్పటివరకు కేవలం 3 హిట్స్ మాత్రమే అందుకుంది.

2020లో వచ్చిన తాన్హాజీ సినిమాతో ఆమె హిట్ కొట్టింది. అదే ఆమె చివరి సక్సెస్. ఆ తర్వాత కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్ లు చేసింది. హిట్స్ లేకపోయినా, తన హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో మంచి క్రేజ్ తెచ్చుకుంది నేహా.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?