నైజాం హక్కులపై మల్లగుల్లాలు?

చిరకాలంగా నైజాంలో తిరుగులేని డిస్ట్రిబ్యూటర్ గా దాదాపు ఏకఛత్రాధిపత్యం నడుపుతున్న దిల్ రాజు అతని సోదరుడు శిరీష్ రెడ్డి లకు గట్టి షాక్ తగిలేలా వుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ నైజాంలో…

చిరకాలంగా నైజాంలో తిరుగులేని డిస్ట్రిబ్యూటర్ గా దాదాపు ఏకఛత్రాధిపత్యం నడుపుతున్న దిల్ రాజు అతని సోదరుడు శిరీష్ రెడ్డి లకు గట్టి షాక్ తగిలేలా వుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ నైజాంలో తన స్వంత డిస్ట్రిబ్యూషన్ దుకాణం తెరవబోతోందని చాలా కిందటే ‘గ్రేట్ ఆంధ్ర’ ఎక్స్ క్లూజివ్ గా వెల్లడించిన సంగతి తెలిసిందే. 

ఇప్పుడు, అది మెటీరియలైజ్ కాబోతోంది. దీని కోసం తెరవెనుక ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి. మైత్రీ మూవీస్, అలాగే మరో భారీ నిర్మాణ సంస్థ, ఇంకా సీడెడ్ కు చెందిన ఓ డిస్ట్రిబ్యూటర్ కలిసి నైజాంలో ఆఫీసు ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది.

సంక్రాంతికి విడుదల కాబోతున్న వాల్తేర్ వీరయ్య, వీరసింహా రెడ్డి సినిమాల పంపిణీ తో ఈ డిస్ట్రిబ్యూషన్ వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో నైజాం పంపిణీ రంగంలో హడావుడి మొదలయింది. ఎక్కువగా థియేటర్లు చేతిలో వున్న ఆసియన్ సునీల్ అలాగే దిల్ రాజు సోదరుడు శిరీష్ అర్జంట్ గా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.

సునీల్ చేతిలో థియేటర్లు వుండడంతో, అర్జంట్ గా అగ్రిమెంట్ల కార్యక్రమం చేసి, థియేటర్లు టైట్ చేసే ప్లాన్ అమలు చేసే పనిలో వున్నట్లు తెలుస్తోంది. మరోపక్కన అన్ని వైపుల నుంచి వత్తిడి చేసి ఎలాగైనా ఆ సినిమాలను తానే నైజాంలో తీసుకునే ఆలోచనను దిల్ రాజు చేస్తున్నట్లు కూడా బోగట్టా. ఈ సారికి తనకే ఇవ్వమని తరువాత కావాలంటే ఆఫీసు పెట్టుకోవచ్చు అని చెప్పినట్లు, ఈ మేరకు రాయబారాలు నడుస్తున్నట్లు తెలుస్తోంది.