Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఒరేయ్ బుజ్జిగా..పాటొచ్చింది

ఒరేయ్ బుజ్జిగా..పాటొచ్చింది

రాజ్ తరుణ్-కొండా విజయ్ కుమార్ కాంబినేషన్ లో నిర్మాత రాధామోహన్ నిర్మిస్తున్న సినిమా ఒరేయ్ బుజ్జిగా. అవుట్ అంట్ రొమాంటిక్ ఫన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న చిత్రం ఇది. మార్చి 25న విడుదలయ్యే ఈ సినిమాకు ఓ ప్లాన్డ్ గా పబ్లిసిటీ చేస్తున్నారు. ఫస్ట్ లుక్, ఫస్ట్ గ్లిమ్స్ తరువాత ఓ సాంగ్ ను విడుదల చేసారు. 

కురిసెన.. కురిసెన.. తొలకరి వలపులె మనసున..మురిసెన.. మురిసెన.. కలలకి కనులకి కలిసెన..’అంటూ సాగే ఈ సాంగ్ ను మెగాహీరో  వరుణ్ తేజ్ ఆన్ లైన్ లోకి విడుదల చేసారు.  అనూప్‌ రూబెన్స్‌ అందించిన స్వరాలు మెలోడీ స్వరాలకు రచయిత కె.కె. సరైన సాహిత్యాన్ని అందించారు. అర్మాన్‌ మాలిక్‌, పి.మేఘన ఈ గీతాన్ని ఆలపించారు. ఈ పాటకు శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీ చేయడం విశేషం. ఈ పాటను అందమైన లొకేషన్లలో రాజ్‌తరుణ్‌, మాళవిక నాయర్‌పై చిత్రీకరించారు.

ఈ ఫస్ట్‌ సింగిల్‌ విడుదలైన సందర్భంగా నిర్మాత కె.కె.రాధామోహన్‌ మాట్లాడుతూ ‘‘వరుణ్‌తేజ్‌ మా సినిమా మొదటి పాటను విడుదల చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఆయనకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ పాట విడుదలైన కొద్దిసేపట్లోనే చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది.  పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. ఉగాది కానుకగా మార్చి 25న సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం. మా బేనర్‌లో తప్పకుండా ‘ఒరేయ్‌ బుజ్జిగా..’ మరో సూపర్‌హిట్‌ మూవీ అవుతుంది.’’ అన్నారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?