Advertisement

Advertisement


Home > Movies - Movie News

సినిమా రిలీజైన తర్వాత మహేష్ ఫస్ట్ రియాక్షన్!

సినిమా రిలీజైన తర్వాత మహేష్ ఫస్ట్ రియాక్షన్!

సర్కారువారి పాట సినిమాకు మొదటి రోజు ఓ సెక్షన్ నుంచి మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ ఫైనల్ గా సినిమా రిజల్ట్ ఎలా ఉండబోతోందనేది మహేష్ ముందుగానే ఉహించాడు. మొదటి రోజే సినిమా సక్సెస్ అయిందని గుర్తించాడు. అందుకే తనే స్వయంగా దర్శకుడు పరశురామ్ కు ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పాడు. సినిమా రిలీజైన తర్వాత మహేష్ ఫస్ట్ రియాక్షన్ ఇది.

"మహేష్ చాలా హ్యాపీ. సినిమా రిలీజైన పొద్దున్నే 8 గంటలకు కాల్ చేశారు. ఆయన నాకు రివర్స్ లో కంగ్రాట్స్ చెప్పారు. నిజానికి ఈ సక్సెస్ నాకే అవసరం. అందుకే మహేష్ కంగ్రాట్స్ చెప్పారు. అదే రోజు రాత్రి అందరం కలిశాం. పార్టీ చేసుకున్నాం. మహేష్ అయితే చిన్న పిల్లాడు అయిపోయారు. చిన్న పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తారో అలా చేశారు."

ఇలా మహేష్ ఫస్ట్ రియాక్షన్ ను, ఆయన ఆనందాన్ని బయటపెట్టాడు దర్శకుడు పరశురామ్. సినిమా సక్సెస్ అయిందనే కంటే.. రెండేళ్ల తమ కృషికి గుర్తింపు దక్కిందనే ఆనందం తనలో ఎక్కువగా ఉందన్నాడు పరశురామ్. 

సినిమా సక్సెస్ అయిన సందర్భంగా మరోసారి మహేష్ తన రైటింగ్ ను మెచ్చుకున్నారని, అలానే కంటిన్యూ చేయాలంటూ ఆల్ ది బెస్ట్ చెప్పారని పరశురామ్ గుర్తు చేసుకున్నాడు.

ప్రస్తుతం యూనిట్ అంతా సెలబ్రేషన్ మూడ్ లో ఉంది. టాలీవుడ్ దర్శకులంతా పరశురామ్ కు ఫోన్లు చేసి అభినందిస్తున్నారు. కొన్ని రోజులు ఈ సక్సెస్ ను ఎంజాయ్ చేసి, ఆ తర్వాత కొత్త సినిమా పనులు మొదలుపెడతానంటున్నాడు పరశురామ్.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?