వీరమల్లుకు మరోసారి మోక్షం

పవన్ కల్యాణ్ ఎప్పుడు ఏ సినిమా చేస్తాడనేది అతడికి మాత్రమే తెలుసు. తదుపరి ఏ సినిమాకు ఆయన కాల్షీట్లు ఇస్తాడనేది ఎవ్వరికీ అంతుచిక్కని వ్యవహారం. ఈ విషయంలో హరిహర వీరమల్లు యూనిట్ పరిస్థితి మరీ…

పవన్ కల్యాణ్ ఎప్పుడు ఏ సినిమా చేస్తాడనేది అతడికి మాత్రమే తెలుసు. తదుపరి ఏ సినిమాకు ఆయన కాల్షీట్లు ఇస్తాడనేది ఎవ్వరికీ అంతుచిక్కని వ్యవహారం. ఈ విషయంలో హరిహర వీరమల్లు యూనిట్ పరిస్థితి మరీ ఘోరం. అన్ని సినిమాలకు ఒక్కో షెడ్యూల్ పూర్తయి, అప్పటికీ కాల్షీట్లు ఖాళీ ఉంటే వీరమల్లుకు కేటాయిస్తున్నాడు పవన్. ఇప్పుడు మరోసారి వీరమల్లుకు మోక్షం దక్కింది.

ప్రస్తుతం ఓజీ సినిమా చేస్తున్నాడు పవన్ కల్యాణ్. సుజీత్ దర్శకత్వంలో, డీవీవీ దానయ్య నిర్మాతగా తెరకెక్కుతోంది ఈ సినిమా. లెక్క ప్రకారం ఈ సినిమా షెడ్యూల్ ముగియాలి. కానీ పవన్ కల్యాణ్, ఈ యూనిట్ కు బంపరాఫర్ ఇచ్చాడు. మరో షెడ్యూల్ చేసుకోమంటూ కాల్షీట్లు కేటాయించాడు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో ఉన్న పవన్, ఈ షెడ్యూల్ కంప్లీట్ అయిన వెంటనే హరిహర వీరమల్లు సినిమా సెట్స్ పైకి రాబోతున్నాడట. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఏఎం రత్నం నిర్మాత. చాన్నాళ్లుగా షూటింగ్ జరుపుకుంటోంది ఈ మూవీ.

వీరమల్లు మూవీ ఈసారి కంప్లీట్ అయిపోతుందని అనుకున్న ప్రతిసారి మరో సినిమా తెరపైకొస్తుంది. కాల్షీట్లు అటు పోతున్నాయి. మొన్నటివరకు వినోదాయశితం రీమేక్ అడ్డొచ్చింది, ఇప్పుడు ఓజీ వచ్చి పడింది. అలా హరిహర వీరమల్లు సినిమా ఎప్పటికప్పుడు లేట్ అవుతూ వస్తోంది. ఈసారి పవన్, ఈ సినిమాకు ఎన్ని రోజులు కాల్షీట్లు ఇచ్చాడనేది ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు.

ప్రస్తుతం ఓజీ సినిమా షూటింగ్ మహాబలేశ్వర్ లో జరుగుతోంది. పవన్ కల్యాణ్, హీరోయిన్ ప్రియాంక మోహన్ మధ్య ఓ సాంగ్ షూట్ చేస్తున్నారు. ఇది 3 రోజుల షెడ్యూల్. ఓజీ, వీరమల్లు సినిమాలతో పాటు.. ఉస్తాద్ గబ్బర్ సింగ్ సినిమా లైన్లో ఉంది. చి మరో 3 రోజులు పవన్ తో షూటింగ్ పెండింగ్ ఉందనే టాక్ నడుస్తోంది.