Advertisement

Advertisement


Home > Movies - Movie News

రూ.45 కోట్ల ఇంటిని దక్కించుకున్న పూజా హెగ్డే

రూ.45 కోట్ల ఇంటిని దక్కించుకున్న పూజా హెగ్డే

ఒక్కోసారి హీరోయిన్ల సంపాదన చూస్తే ఆశ్చర్యమేస్తుంది. వాళ్లకు ఇంత డబ్బు ఎలా వస్తుందా అనిపిస్తుంది. పూజా హెగ్డే కూడా అలాంటి షాక్ ఇచ్చింది. ఈ ముద్దుగుమ్మ ఏకంగా 45 కోట్ల రూపాయల ఖరీదైన నివాసాన్ని సొంతం చేసుకుంది.

ముంబయిలోని బాంద్రాలో ఖరీదైన ప్రాపర్టీ కొనుగోలు చేసింది పూజాహెగ్డే. దీని ఖరీదు అక్షరాలా 45 కోట్ల రూపాయలు. సముద్రం ఎదురుగా ఉండే ఈ ప్రాపర్టీలోకి త్వరలోనే షిఫ్ట్ అవ్వబోతోంది ఈ హీరోయిన్. 4వేల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఈ ప్రాపర్టీని తన టేస్ట్ కు తగ్గట్టు డిజైన్ చేయించుకుంది పూజా.

నిజానికి పూజాహెగ్డేకు ముంబయి కొత్త కాదు. ఆమెకు ఆల్రెడీ ముంబయిలో ఓ ఫ్లాట్ ఉంది. అక్కడ్నుంచి ఇప్పుడు బాంద్రాలోని ఈ మాన్షన్ కు మారుతోంది. బాంద్రాలో ఓ ప్రాపర్టీ కలిగి ఉండడం తారలకు ఇప్పుడో స్టేటస్ సింబల్ గా మారిపోయింది.

త్వరలోనే ఆమె షాహిద్ కపూర్ తో కలిసి ఓ బాలీవుడ్ ప్రాజెక్టు స్టార్ట్ చేయబోతోంది. దీంతో పాటు సౌత్ లో ఆమె కొత్త సినిమాల ప్రకటనలు రాబోతున్నాయి. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?