‘పూరి’ కావాలని వదిలారా?

లైగర్ సినిమా నుంచి ఈ రోజు వదిలిన పోస్టర్ సోషల్ మీడియాలొ కొంత ట్రోలింగ్ కు దారి తీసింది. గతంలో బాబుమోహన్ సీన్లు, సునీల్ సీన్లు, ఇటీవల సంపూర్ణేష్ బాబు పోస్టర్ ఇలా చాలా…

లైగర్ సినిమా నుంచి ఈ రోజు వదిలిన పోస్టర్ సోషల్ మీడియాలొ కొంత ట్రోలింగ్ కు దారి తీసింది. గతంలో బాబుమోహన్ సీన్లు, సునీల్ సీన్లు, ఇటీవల సంపూర్ణేష్ బాబు పోస్టర్ ఇలా చాలా చాలా వెలికి తీసి ఈ పోస్టర్ ను మామూలుగా ట్రోల్ చేయడం లేదు. ఉదయాన్నే పోస్టర్ వదిలారు. పొద్దున్న పొద్దున్నే మాకేంటీ దర్శనం అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇదిలా వుంటే దర్ళకుడు పూరి జగన్నాధ్ ఈ ట్రోలింగ్ ను ఊహించే పోస్టర్ వదిలారని ఇన్ సైడ్ వర్గాల బోగట్టా. లైగర్ సినిమా ప్రారంభమై చాలా కాలం అయిపోయింది. ఆగస్టులో విడుదల అని ప్రకటించినా బజ్ రాలేదు. 

ఇలాంటి టైమ్ లో పబ్లిసిటీ స్టార్ట్ చేస్తూనే, అది జూమ్ అంటూ వెళ్లేలా వుండాలన్నది పూరి ప్లాన్. అందుకే ఫొటో షూట్ చేయించి మరీ ఈ పోస్టర్ వదిలినట్లు తెలుస్తోంది.

పాజిటివ్, నెగిటివ్ ఏదైనా ప్రచారమే. సినిమా పేరు నలుగురిలోకి వెళ్లాలి. నలుగురు దాని గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఈ ట్రోలింగ్ వల్ల అదే జరిగింది. మరోపక్కన ఇదే పోస్టర్ ను అనేక మంది సెలబ్రిటీలు, ముఖ్యంగా హీరోయిన్ల చేత సోషల్ మీడియాలో పోస్ట్ చేయించడం కూడా పూరి ఐడియానే అంట. తనే స్వయంగా అందరికీ ఫోన్ చేసి, మెసేజ్ లు పెట్టి పోస్ట్ చేయించారట.

మొత్తానికి నెగిటివ్ పబ్లిసిటీ ద్వారా లైగర్ సినిమాకు పాజిటివ్ బజ్ తేవాలనుకుంటున్నారన్న మాట దర్ళకుడు పూరి జగన్నాధ్.