Advertisement

Advertisement


Home > Movies - Movie News

రాజమౌళి రెండు దుప్పట్లు

రాజమౌళి రెండు దుప్పట్లు

దర్శకుడు రాజమౌళి కొత్త సంప్రదాయానికి తెర తీసారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో రెండు విడుదల తేదీలను లాక్ చేసారు. మార్చి 18 లేదా ఏప్రిల్ 28న తమ సినిమా విడుదల ప్లాన్ చేస్తున్నట్లు ఆర్ఆర్ఆర్ టీమ్ అధికారికంగా ప్రకటించింది. కరోనా పరిస్థితుల రీత్యా ఈ విధంగా ప్రకటించాల్సి వస్తోందని పేర్కొనడం విశేషం.

మార్చి 18 న రావడానికి రెడీగా వున్నామని, వీలు కాకపోతే ఏప్రిల్ 28న విడుదల చేస్తామని పేర్కొన్నారు. దర్శకుడు రాజమౌళి ఇలా రెండు తేదీల మీదే రుమాళ్లు కాదు ఏకంగా దుప్పట్లే వేసేసారు. దీంతో ఇప్పుడు మిగిలిన పెద్ద సినిమాలు అయోమయంలో పడతాయి.

ఏప్రిల్ 1న ఆచార్య విడుదల అనుకున్నారు. ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి. ఫిబ్రవరి 25 వీలు కాకపోతే మరో డేట్ చూడాలని భీమ్లా నాయక్ టీమ్ చూస్తుంది మరి వారి పరిస్థితి ఏమిటో? మార్చి 17 లేదా 18న విడుదల చేస్తామని సన్నిహితులతో పేర్కొంటూ, ప్రకటించకుండా ఆగింది రాధేశ్యామ్ టీమ్. ఇప్పుడు వారి పరిస్థితి చూడాలి. 

రెండు డేట్ లు లాక్ చేయడంతో రెండు వారాలు అటుగా మరే డేట్ లు ప్రకటించడానికి కుదరదు. అంటే దాదాపు రెండు నెలల గ్యాప్ ను ఆర్ఆర్ఆర్ లాక్ చేసేసినట్లు అయింది. దీనిపై ఇండస్ట్రీ నిర్మాతలు లొలోపల ఇదెక్కడి పద్దతి అంటూ సణుక్కుంటున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?