సూపర్ స్టార్, మెగాస్టార్ తో మల్టీస్టారర్

కొన్నేళ్ల కిందటి సంగతి.. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో మల్టీస్టారర్ తీస్తానని ఆర్బాటంగా ప్రకటించారు పొలిటీషియన్ కమ్ బిజినెస్ మేన్ సుబ్బరామిరెడ్డి. అయితే అది ప్రకటనకే పరిమితమైంది. ఆ తర్వాత…

కొన్నేళ్ల కిందటి సంగతి.. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో మల్టీస్టారర్ తీస్తానని ఆర్బాటంగా ప్రకటించారు పొలిటీషియన్ కమ్ బిజినెస్ మేన్ సుబ్బరామిరెడ్డి. అయితే అది ప్రకటనకే పరిమితమైంది. ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో మల్టీస్టారర్ ప్రకటన రాలేదు. 

మళ్లీ ఇన్నేళ్లకు మరో క్రేజీ మల్టీస్టారర్ తెరపైకొచ్చింది. సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి హీరోలుగా సినిమా తీస్తానంటున్నాడు కొరియోగ్రాఫర్ కమ్ హీరో కమ్ డైరక్టర్ లారెన్స్. దర్శకుడిగా లారెన్స్ కు ఓ స్టయిల్ ఉంది. ఆల్రెడీ నాగార్జున లాంటి సీనియర్ ను డైరక్ట్ చేసిన అనుభవం కూడా ఉంది. 

కాబట్టి, తన అనుభవంతో చిరంజీవి-రజనీకాంత్ ను పెట్టి ఓ భారీ మల్టీస్టారర్ తీస్తానంటున్నాడు. అంతేకాదు, ఆ మల్టీస్టారర్ కోసం తన దగ్గర కథ కూడా సిద్ధంగా ఉందని ప్రకటించి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు. 

ఇప్పుడున్న పరిస్థితుల్లో మల్టీస్టారర్లు తీయడం పెద్ద సమస్య కాదు, చాలామంది మల్టీస్టారర్లు చేయడానికి రెడీ అవుతున్నారు. అంతెందుకు, చిరంజీవి చేసిన వాల్తేరు వీరయ్య కూడా మల్టీస్టారర్ సినిమానే. ఎటొచ్చి ఈ విషయంలో రజనీకాంత్ ను ఒప్పించడం కాస్త కష్టమైన పని. 

అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి కాబట్టి.. లారెన్స్ గట్టిగా రంగంలోకి దిగితే ఇటు చిరంజీవి, అటు రజనీకాంత్ ను ఒప్పించడం పెద్ద పని కాదు.