ప్రియుడితో గోవా చెక్కేసిన హీరోయిన్

బాలీవుడ్ లో అలియాభట్, రణబీర్ కపూర్ వ్యవహారం బహిరంగ రహస్యం. వాళ్లిద్దరి డేటింగ్ ఎప్పటికప్పుడు వార్తల్లో నలుగుతూనే ఉంటుంది. రణబీర్ ను చూడకుండా ఉండలేనంటూ ఆమధ్య అలియా ఓపెన్ స్టేట్ మెంట్ కూడా ఇచ్చేసింది.…

బాలీవుడ్ లో అలియాభట్, రణబీర్ కపూర్ వ్యవహారం బహిరంగ రహస్యం. వాళ్లిద్దరి డేటింగ్ ఎప్పటికప్పుడు వార్తల్లో నలుగుతూనే ఉంటుంది. రణబీర్ ను చూడకుండా ఉండలేనంటూ ఆమధ్య అలియా ఓపెన్ స్టేట్ మెంట్ కూడా ఇచ్చేసింది. ఇప్పుడు వీళ్లిద్దరూ కలిసి ఏకాంతంగా గోవా ట్రిప్ ముగించారు.

రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి ఓ షెడ్యూల్ పూర్తిచేసింది అలియాభట్. ఆ షెడ్యూల్ పూర్తయిన వెంటనే రణబీర్ తో కలిసి గోవా వెళ్లింది. 2 రోజుల పాటు ఇద్దరూ ఏకాంతంగా గోవాలో గడిపారు. ఈసారి చెప్పుకోదగ్గ విశేషం ఏంటంటే.. ఎలాంటి భద్రతా సిబ్బంది లేకుండానే ఈ ఇద్దరు మాత్రమే గోవాకు వెళ్లొచ్చారు.కనీసం బౌన్సర్లను కూడా పెట్టుకోలేదు.

గోవాలో ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్ బాల్ మ్యాచులు జరుగుతున్నాయి. వీటిలో ముంబయి సిటీ టీమ్ కు కో-ఓవర్ గా వ్యవహరిస్తున్నాడు రణబీర్. ఆ మ్యాచ్ చూసేందుకు అలియాను తీసుకొని గోవాకు వెళ్లాడు. పనిలో పనిగా ఇద్దరూ ఏకాంతంగా 2 రోజుల పాటు గడిపారు. తిరిగి రాత్రి ముంబయికి చేరుకున్నారు.

ముంబయిలో తన సొంత డబ్బుతో ఓ ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసింది అలియా. అటు రణబీర్ కూడా తనకంటూ ఓ ఫ్లాట్ ఎప్పుడో కొనుక్కున్నాడు. ఈ రెండు ఫ్లాట్స్ లో ఈ ప్రేమికులిద్దరూ ఎప్పటికప్పుడు కలుసుకుంటారు. ఈమధ్య రణబీర్ తండ్రి రిషీ కపూర్ చనిపోయినప్పుడు, ఏకంగా 10 రోజుల పాటు రణబీర్ తోనే ఉండి అన్ని పనులు దగ్గరుండి చూసుకుంది అలియా.

బిగ్ బాస్ విన్న‌ర్ ఎవ‌రో నాకు తెలుసు