రవితేజ-మైత్రీ మూవీస్ మరోసారి

మాస్ హీరో రవితేజతో మళ్లీ మరో సినిమా ప్లాన్ చేస్తున్నారు మైత్రీ మూవీస్ అధినేతలు. గతంలో అమర్ అక్బర్ ఆంథోనీ అనే సినిమా చేసారు. కానీ అది బాక్సాఫీస్ దగ్గర దారుణంగా పెయిల్ అయింది.…

మాస్ హీరో రవితేజతో మళ్లీ మరో సినిమా ప్లాన్ చేస్తున్నారు మైత్రీ మూవీస్ అధినేతలు. గతంలో అమర్ అక్బర్ ఆంథోనీ అనే సినిమా చేసారు. కానీ అది బాక్సాఫీస్ దగ్గర దారుణంగా పెయిల్ అయింది. మైత్రీ మూవీస్ చాలా డబ్బు పొగొట్టుకుంది. ఆ తరువాత రవితేజ చాలా సినిమాలు చేసారు. వాటిలో మంచి హిట్ లు వున్నాయి, ఫ్లాపులు వున్నాయి. మైత్రీ మూవీస్ కూడా భారీ సినిమాల దిశగా సాగిపోతోంది.

ఈ నేపథ్యంలో ఈ ఇద్దరూ కలిసి మరో సినిమా చేసే ఆలోచనలు సాగుతున్నాయి. క్రాక్ టీమ్ ను రిపీట్ చేయాలని మైత్రీ సంస్థ ఆలోచిస్తోంది. రవితేజ కు క్రాక్ మంచి హిట్. అందుకే అదే టీమ్ తో ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. 

క్రాక్ టీమ్ తో మళ్లీ మరో సినిమా చేయాలని రవితేజ కూడా చాలా ఆసక్తిగా వున్నారట. అందుకే ఈ కాంబో ప్రాజెక్ట్ ఫిక్స్ అవుతుంది. మంచి టైమ్ చూసుకుని అనౌన్స్ మెంట్ కూడా రావచ్చు.

క్రాక్ సినిమా తరువాత రవితేజ కు ధమాకా వరకు హిట్ పడలేదు. ఆ తరువాత కూడా రావణాసుర దారుణంగా ఫ్లాప్ అయింది. టైగర్ నాగేశ్వరరావు, ఈగిల్ సినిమాలు నిర్మాణంలో వున్నాయి. సితార సంస్థ సినిమా ప్రీ ప్రొడక్షన్ లో వుంది.