పవన్ పై రేణు దేశాయ్ కీలక వ్యాఖ్యలు!

పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమా థియేటర్స్‌లో ఎలా ఆడిందో అన్న దాని కంటే సోషల్ మీడియాలో మాత్రం నిత్యం వివాదాలు చుట్టూనే సాగుతోంది. చివరికి రాజకీయాల నుంచి దూరంగా ఉంటున్న చిరంజీవి కూడా…

పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమా థియేటర్స్‌లో ఎలా ఆడిందో అన్న దాని కంటే సోషల్ మీడియాలో మాత్రం నిత్యం వివాదాలు చుట్టూనే సాగుతోంది. చివరికి రాజకీయాల నుంచి దూరంగా ఉంటున్న చిరంజీవి కూడా ఆ సినిమా వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. తాజాగా బ్రో వివాదంపై  ప‌వ‌న్ రెండో మాజీ భార్య రేణు దేశాయ్ కీలక వ్యాఖ్యలు చేసింది.

తనపై బ్రో సినిమాలో వెటకారం చేశారని మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ పవన్ మూడు పెళ్లిళ్లపై.. తన పిల్లలపై సినిమా గాని, వెబ్ సిరీస్ గాని నిర్మిస్తానని చెప్పిన వాఖ్య‌ల‌పై రేణు దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వీడియోలో మాట్లాడుతూ .. బ్రో సినిమా వివాదం ఏదో నాకు అర్థం తెలియదు కానీ అనవసరంగా పిల్లల్ని.. మమ్మల్ని లాగొద్దండంటూ వేడుకుంది.

అలాగే పవన్ డబ్బు మనిషి కాదని, సమాజం, పేద వాళ్లకు ఆయ‌న ఎప్పుడు మంచి చేయాలనుకుంటారని వారి కోసం కుటుంబాన్ని ప‌క్క‌న పెట్టార‌ని ప‌వ‌న్‌పై ప్రశంసలు కురిపించింది. తాజా రేణు దేశాయ్ మాట‌ల‌తో మ‌రోసారి బ్రో సినిమా వార్త‌ల్లోకి వ‌చ్చింది. చూస్తుంటే ఎన్నిక‌ల వ‌ర‌కు రాజ‌కీయలు మొత్తం బ్రో సినిమా చుట్టే కొన‌సాగేలా క‌న‌ప‌డుతున్నాయి.