రోడ్ ప్రమాదంలో గాయపడి, చిరకాలం ఆసుపత్రిలో కోమాలో వుండి తేరుకుని ఇంటికి చేరుకున్నారు హీరో సాయి ధరమ్ తేజ్. ఇది చాలా జరిగి చాలా రోజులు దాటిపోయింది. కానీ సాయి ధరమ్ తేజ్ ఫోటో ఒక్కటీ బయటకు రాలేదు.
కొంతమంది దర్శకులు వెళ్లి కలిసినా ఫొటోలు బయటకు రాలేదు. ఓ చిన్న ఫ్యామిలీ వీడియో వచ్చినా అందులో వెనుక నుంచే చూపించారు. దీంతో ఆయన ఫేస్ కు ఏమైనా అయిందేమో అని ఫ్యాన్స్ టెన్షన్ పడ్డారు.
అందుకే ఫోటోలు బయటకు రావడం లేదేమో అని కంగారు పడ్డారు. అయితే క్రిస్మస్ నాడు సాయిధరమ్ ఫొటో ఒకటి బయటకు వచ్చింది. ప్రమాదానికి ముందు ఎలా వున్నారో, అలాగే వున్నారు ఆ ఫోటోలో. అల్లు అర్ఙున్ భార్య స్నేహారెడ్డి ఈ ఫొటోను ఇన్ స్టా లో షేర్ చేసారు.
మెగా ఫ్యామిలీ సభ్యులు పలువురు ఈ ఫొటోలో వున్నారు. రామ్ చరణ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ లతో పాటు సాయి ధరమ్ తేజ్ కూడా ఈ ఫొటోలో వున్నారు. ప్రమాదం జరిగిన తరువాత బయటకు వచ్చిన ఫొటో ఇదే.