Advertisement

Advertisement


Home > Movies - Movie News

'పాట' అదరగొట్టాలమ్మా!

'పాట' అదరగొట్టాలమ్మా!

‘సర్కారు వారి పాట’ చిత్రానికి ముఖ్య సాంకేతిక బృందం అంతా కూడా ‘అల వైకుంఠపురములో’కి పని చేసిన వారే వుండడం ప్రత్యేకంగా ఆకర్షిస్తోంది. ముఖ్యంగా ఈ చిత్రానికి తమన్‌తోనే సంగీతం చేయించాలని మహేష్ చెప్పినట్టుగా తెలిసింది. ‘గీత గోవిందం’కి సూపర్‌హిట్ సాంగ్స్ చేసిన గోపిసుందర్ పట్ల పరశురామ్‌కి ఆసక్తి వున్నా కానీ మహేష్ మాటని కాదనలేక తమన్ పాట ఖాయం చేసుకున్నాడు.

‘అల వైకుంఠపురములో’ పాటలు ఏ రేంజ్‌లో హిట్టయ్యాయో తెలిసిందే. ‘సర్కారు వారి పాట’ ఆల్బమ్ కూడా అదే రేంజ్‌లో వుండాలని మహేష్ చెప్పాడట. చేసిన ప్రతి పాటా ట్రెండ్ అయిపోవాలని, వంద మిలియన్ వ్యూస్ అలవోకగా వచ్చేంత క్యాచీగా వుండాలని తమన్‌తో అన్నాడట. ఆ స్థాయి పాటలు ఆశిస్తూనే మహేష్ ఈ చిత్రానికి తమన్‌ని ఖాయం చేసుకున్నాడు కనుక అతను అంచనాలను అందుకోక తప్పదు మరి.

ఇంకా షూటింగ్ మొదలు కాకపోయినా కానీ తమన్ మాత్రం ఈ చిత్రం పాటలను ఛాలెంజ్‌గా తీసుకుని చేస్తున్నాడట. ఈ చిత్రం కోసం ఇప్పటికే ఒక ట్యూన్ వినిపించాడని కూడా వార్తలొస్తున్నాయి. ఇటీవలి కాలంలో కమర్షియల్ సినిమాల బాట పట్టిన మహేష్ ఈ చిత్రంతో వెరైటీ అందిస్తాడనే ఫీలింగ్ టైటిల్‌తోను, ప్రీ లుక్ పోస్టర్‌తోను కలిగించడంతో ‘సర్కారు వారి పాట’పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. 

గృహ‌మే లేకుండా ప్ర‌జ‌ల‌తో గృహ ప్ర‌వేశం చేయించిన ఘ‌నుడు చంద్ర‌బాబు

వెళ్ళేది ఎవరు? పిలిచేది ఎవరు?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?