ఐటీ దాడులు.. శ్రీరెడ్డి ఆనంద భాష్పాలు

టాలీవుడ్ లో జరిగిన ఐటీ దాడులపై శ్రీరెడ్డి ఆనందం వ్యక్తంచేసింది. మరీ ముఖ్యంగా సురేష్ బాబు, నానికి సంబంధించిన ఇళ్లు, ఆఫీసులపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించడంతో ఆనంద భాష్పాలు రాల్చింది.…

టాలీవుడ్ లో జరిగిన ఐటీ దాడులపై శ్రీరెడ్డి ఆనందం వ్యక్తంచేసింది. మరీ ముఖ్యంగా సురేష్ బాబు, నానికి సంబంధించిన ఇళ్లు, ఆఫీసులపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించడంతో ఆనంద భాష్పాలు రాల్చింది. ఈ రోజు కోసం ఎన్నాళ్ల నుంచో వెయిట్ చేస్తున్నానని ప్రకటించింది. శ్రీరెడ్డి ఇంత ఆనందపడ్డానికి కారణం అందరికీ తెలిసిందే.

సురేష్ బాబు చిన్నకొడుకు తనను మోసం చేశాడని గతంలో ఆరోపించింది శ్రీరెడ్డి. నిజానికి ఈ కాస్టింగ్ కౌచ్ వ్యవహారంతోనే ఆమె పాపులర్ అయింది. దీనికి సంబంధించి అభితో శ్రీరెడ్డి క్లోజ్ గా ఉన్న ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. కానీ అప్పట్లో ఈ వ్యవహారాన్ని పక్కదారి పట్టించారు.

ఆ తర్వాత కాస్టింగ్ కౌచ్ పై ఉద్యమం అంటూ చాలా హంగామా చేసింది శ్రీరెడ్డి. చాలామంది నటులపై ఆరోపణలు చేసింది. ఈ క్రమంలో అప్పట్లో నానిపై కూడా తీవ్ర విమర్శలు చేసింది. నానిని ఓ స్త్రీలోలుడు అంటూ ఆరోపించింది. నాని కామానికి బలైపోయిన అమ్మాయిలు తనకు తెలుసంటూ కామెంట్స్ చేసింది.

కట్ చేస్తే, ఇప్పుడు అదే నాని, అదే సురేష్ బాబుపై ఐటీ దాడులు జరిగాయి. విషయం తెలుసుకున్న శ్రీరెడ్డి పొంగిపోయింది. దేవుడు ఉన్నాడని, తనకు అన్యాయం చేసిన వాళ్లు ఎప్పటికైనా శిక్ష అనుభవిస్తారనడానికి తాజా ఐటీ దాడులే ఉదాహరణగా చెప్పుకొచ్చింది. నాని తనకు చేసిన అన్యాయానికి శిక్ష అనుభవిస్తున్నాడని ఆక్షేపించింది.