Advertisement

Advertisement


Home > Movies - Movie News

టాలీవుడ్ తో వేరేవాళ్లకు పనేంటీ?

టాలీవుడ్ తో వేరేవాళ్లకు పనేంటీ?

నైజాం డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను కదిపిన తేనెతుట్ట ప్రకంపనులు ఆగలేదు. ఈరోజు నిర్మాతల గిల్డ్ పెద్దలు కొందరు సమావేశమై వరంగల్ శ్రీను, ఏస్ డిస్ట్రిబ్యూటర్, నిర్మాత దిల్ రాజుపై చేసిన ఆరోపణలను చర్చించినట్లు బోగట్టా. 

అయితే వరంగల్ శ్రీను ఈ విషయంలో జనసేన లీడర్ ను తీసుకురావడం, ఉస్మానియా జేఏసి తో కూడా తెరవెనుక సంప్రదింపులు జరిగాయని వార్తలు రావడంపై కాస్త గట్టి డిస్కషన్ నడిచినట్లు బోగట్టా.

ఇండస్ట్రీ జనాలతో సమస్యలు వస్తే మనం మనం చూసుకోవాలి కానీ బయటవాళ్లను ఇన్ వాల్వ్ చేయడం ఎంత వరకు సమంజసం అని గిల్డ్ పెద్దలు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. 

ఇలా బయటవాళ్లను తీసుకురావడం ప్రారంభిస్తే, ఎవరికి వారు తీసుకురావడం ప్రారంభం అవుతుందని అందువల్ల ఇలాంటి వ్యవహారాలకు ఆదిలోనే చెక్ చెప్పాలని అభిప్రాయపడ్డారు.

అందువల్ల తరువాత సమావేశానికి వరంగల్ శ్రీనును కూడా పిలచి, ఇలాంటి సమస్యలు వస్తే తమ దృష్టికి తేవాలని, అంతే తప్ప బయటవారి జోక్యం వద్దు అని చెప్పాలని నిర్ణయించినట్లు బోగట్టా.

మంచి కిక్‌ ఇచ్చారు

ఈ సంక్రాంతి అల్లుడు నేనే

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?