9 వందల మంది.. మధ్యలో పవన్ కల్యాణ్!

హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ పై రోజురోజుకు పెరుగుతున్న అనుమానాలు, ఊహాగానాలకు చెక్ పెట్టే ప్రయత్నం చేసింది యూనిట్. ఈరోజు వరుస అప్ డేట్స్ ఇచ్చింది. పనిలోపనిగా 2 వర్కింగ్ స్టిల్స్ కూడా రిలీజ్…

హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ పై రోజురోజుకు పెరుగుతున్న అనుమానాలు, ఊహాగానాలకు చెక్ పెట్టే ప్రయత్నం చేసింది యూనిట్. ఈరోజు వరుస అప్ డేట్స్ ఇచ్చింది. పనిలోపనిగా 2 వర్కింగ్ స్టిల్స్ కూడా రిలీజ్ చేసింది.

హరిహర వీరమల్లు సినిమా లేట్ అవుతోందనే కథనాలపై పరోక్షంగా స్పందించింది యూనిట్. చారిత్రక నేపథ్యంతో నాణ్యమైన సినిమా తీస్తున్నప్పుడు కాలపరీక్ష తప్పదంటూ స్టేట్ మెంట్ ఇచ్చింది. ఇలాంటి సినిమాల కోసం చాలా రీసెర్చ్, వందలాది మంది సిబ్బంది, అపార కృషి అవసరమని ప్రకటించుకుంది.

మరోవైపు షూటింగ్ పై కూడా స్పష్టత ఇచ్చింది యూనిట్. అక్టోబర్ నుంచి షెడ్యూల్ ప్రకారం, అనుకున్నది అనుకున్నట్టుగా షూటింగ్ జరుగుతోందని హరిహర వీరమల్లు యూనిట్ ప్రకటించింది. పవన్ కల్యాణ్ తో పాటు 900 మంది సిబ్బంది, నటీనటులు తమ శక్తివంచన లేకుండా సినిమా కోసం కష్టపడుతున్నారట.

హరిహర వీరమల్లు సినిమా ఓ మైల్ స్టోన్ గా నిలిచిపోతుందని చెబుతున్నాడు దర్శకుడు క్రిష్. సినిమాకు సంబంధించి మరింత ముందుకు సాగడానికి అందరి మద్దతు కావాలని ఆకాంక్షించాడు.

ఈ సినిమాకు సంబంధించి ఓవైపు వర్క్ షాపులు, మరోవైపు షూటింగ్ సమాంతరంగా నిర్వహిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఓ ప్రత్యేక పాత్రలో అనసూయ కనిపించనుంది.