బుల్లితెర యాంకర్లలో శ్రీముఖిది ఓ ప్రత్యేక పంథా. శ్రీముఖి ఉందంటే సందడే సందడి. మాట్లాడ్డానికి మైక్ అవసరం లేకుండానే తన అరుపులతో హంగామా క్రియేట్ చేస్తుంటారామె. బిగ్బాస్ రియాల్టీ షోలో పాల్గొని తన పాపులారిటీని అమాంతం పెంచుకున్నారు.
కేవలం నటనే కాదు ఆమెలో ఇంకో కళ కూడా దాగి ఉందనే విషయం తాజాగా వెలుగు చూసింది. శ్రీముఖిలోని మంచి చిత్రకారిణి ఇప్పుడు బయటికొచ్చింది. మహాశివరాత్రిని పురస్కరించుకుని రాత్రంతా జాగరణ చేశానని, ఈ సమయాన్ని వృథా చేయకుండా మంచి బొమ్మను చిత్రీకరించానని ఆమె సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు.
పరమ శివుడి బొమ్మను చిత్రీకరించి, ఆ ఫొటోను సోషల్ మీడియాలో శ్రీముఖి చేర్ చేశారు. ఆ బొమ్మ వైరల్ అవుతోంది. ఆ బొమ్మ చూడచక్కగా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తుండడం విశేషం. శ్రీముఖిలో దాగి ఉన్న చిత్రకారిణి గురించి ఇంత కాలం ఎవరికీ తెలియకపోవడం ఆశ్చర్యమే అని కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా శ్రీముఖి నటించిన క్రేజీ అంకుల్ సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ప్రముఖ గాయకుడు మనో, రఘుకుంచె , రాజా రవీంద్ర కీలక పాత్రలో నటించారు.