తమిళ హీరో ధనుష్ తొలి తెలుగు స్ట్రయిట్ సినిమా అనౌన్స్ మెంట్ వచ్చేస్తోంది. తొలిప్రేమ, రంగ్ దే వంటి సినిమాలు అందించిన దర్శకుడ వెంకీ అట్లూరి తయారుచేసుకున్న సబ్జెక్ట్ తో ధనుష్ సినిమా చేయబోతున్నాడు.
విద్యా వ్యవస్థలోని లొసుగుల మీద ఈ సినిమా వుంటుంది. అయితే కాస్త వెనక్కు వెళ్లి సమస్యలను డిస్కస్ చేస్తుండడంతో పీరియాడికల్ సినిమా లుక్ వుంటుంది.
దర్శకుడు త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య నిర్మాతగా ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు. త్రివిక్రమ్ స్వంత బ్యానర్ ఫ్యార్ట్యూన్ ఫోర్ సమర్పణలో తయారయ్యే ఈ సినిమాను సితార పతాకంపై నాగవంశీ నిర్మిస్తారు.
పేరు వినగానే చదువులు, స్టూడెంట్లు, టీచర్లు గుర్తుకువచ్చే క్యాచీ టైటిల్ లో ఈసినిమాను అందిస్తున్నారు. సితార బ్యానర్ ను సమర్పించే పిడి ప్రసాద్ పేరు ఇక వుండకపోవచ్చు.