తెలుగుదేశం పార్టీ విషయంలో కొత్త ప్రచారం ఊపందుకుంటోంది. నామినేషన్లకు ఇంకా కాస్త గడువు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ప్రకటన పొందిన కొందరు అభ్యర్థులను చంద్రబాబు నాయుడు మార్చబోతున్నారనే టాక్ మీడియా సర్కిల్స్ లో నడుస్తోంది. తెలుగుదేశం పార్టీ తరఫున కొంతమంది అభ్యర్థుల విషయంలో రచ్చ రాజుకుంది. పలు చోట్ల తెలుగుదేశం ఆఫీసుల మీదకే టీడీపీ క్యాడర్ దాడికి దిగింది. చంద్రబాబు నాయుడు ఫొటోలను చెప్పులతో కొడుతూ తెలుగుదేశం కార్యకర్తలు తమదైన మార్కు నిరసనను తెలిపారు.
కొన్ని చోట్ల అయితే జిల్లా ఆఫీసుపై ఒక సారి, నియోజకవర్గం ఆఫీసుపై మరోసారి, టౌన్ ఆఫీసుపై ఇంకోసారి దాడులు చేసి మరీ నిరసనలు తెలుపుతున్నాయి పచ్చ చొక్కాలు. ఎక్కడ చంద్రబాబు ఫొటోలు కనిపించినా చెప్పులతో కొడుతూ వారు నిరసనలు దిగుతుండటం గమనార్హం!
అలాగే చాలా చోట్ల చంద్రబాబు ఎంపిక చేసిన అభ్యర్థులు ఆశ్చర్యాన్ని గొలుపుతున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో సామాన్యులకు ఎవరో కూడా తెలీని వారిని అభ్యర్థులుగా ప్రకటించారనే ఆశ్చర్యాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మార్పులు తప్పవనేది టాక్!
కనీసం ఏడెనిమిది నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు ఉండబోతోందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించినా.. ఆ మేరకు మార్పులు అయితే ఉంటాయనే టాక్ నడుస్తోంది. ఏడెనిమిది చోట్ల మార్పులపై చంద్రబాబు నుంచి ప్రకటనలు ఉండవచ్చనే రూమర్లు వినిపిస్తున్నాయి. మరి అదే జరిగితే కొత్త గందరగోళానికి తెరలేచే అవకాశాలూ లేకపోలేదు!
ఆల్రెడీ అభ్యర్థుల ప్రకటన నేపథ్యంలో.. అభ్యర్థిత్వం పొందిన వారైనా ఉత్సాహంగా ప్రచారం చేసుకుంటూ పోతుంటారు. అలాంటిది ఇప్పుడు మార్పు అంటే .. ఆల్రెడీ బజారుకు ఎక్కిన వారికి మళ్లీ ప్రాధాన్యతను ఇచ్చినట్టుగా అవుతుంది. చంద్రబాబు ఫొటోలకు చెప్పు దెబ్బలు కొట్టిన వారికి అభ్యర్థిత్వాలను ఖరారు చేసినట్టుగా అవుతుంది. ఏదేమైనా మార్పులు ఖాయమనే ప్రచారం అయితే గట్టిగా సాగుతూ ఉంది!
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు